
ఫైనల్గా పాన్ ఇండియా సినిమాను పట్టాలెక్కించారు యువ సామ్రాట్ నాగచైతన్య. ప్రేమమ్, సవ్యసాచి లాంటి రెండు డిఫరెంట్ సినిమాలు చేసిన చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే భారీ సినిమా చేస్తున్నారు.

శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జునతో పాటు వెంకీ మామ కూడా చీఫ్ గెస్ట్లుగా హాజరై చైతూ అండ్ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న చైతూ చాలా రోజులుగా లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ఫిజిక్ విషయంలోనూ తెర మీద భారీ చేంజెస్ చూపించబోతున్నారు. రెగ్యులర్ వెయిట్ కన్నా పది కిలీలు బరువు తగ్గి రగ్గడ్గా కనిపిస్తున్నారు.

థాంక్యూ, కస్టడీ సినిమాల ఫెయిల్యూర్ తరువాత ఆలోచనలో పడ్డ నాగచైతన్య, ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన యువ సామ్రాట్, ఇప్పుడు కాస్త స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.

గతంలో చందూ మొండేటి కాంబినేషన్లో నాగచైతన్య హీరోగా చేసిన సినిమాల్లో ప్రేమమ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, సవ్యసాచి ఫ్లాప్ అయ్యింది. మరోసారి ఇదే కాంబో రిపీట్ అవుతుండటం, అది కూడా పాన్ ఇండియా మూవీ కావటంతో ఈ సారి రిజల్ట్ ఎలా ఉంటుందా అన్న క్యూరియాసిటీ అక్కినేని అభిమానుల్లో కనిపిస్తోంది.