
మెహబూబా సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది నేహాశెట్టి. ఫస్ట్ మూవీ హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ కూడా రాలేదు.

దీంతో ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. కానీ సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన డీజే టిల్లు సినిమాతో ఈ ముద్దుగుమ్మ రేంజ్ మారిపోయింది.

డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ సెన్సెషన్ హీరోయిన్గా మారిపోయింది నేహాశెట్టి. ఇందులో గ్లామర్ లుక్లో కనిపించి ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది.

రాధిక నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ అయినా.. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నేహాశెట్టి.

కొన్నాళ్లుగా నెట్టింట సైలెంట్ అయిన నేహాశెట్టి.. తాజాగా లెహంగాలో అందమైన ఫోటోస్ షేర్ చేసింది. దీంతో ఏమై పోయావమ్మా ఇన్నాళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.