Jathi Rathnalu Movie Team In Thirumala: తిరుమలలో సందడి చేసిన ‘జాతిరత్నాలు’ టీం..
గురువారం ఉదయం 'జాతిరత్నాలు' టీం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మహశివరాత్రి కానుకగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా 'జాతిరత్నాలు' టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘జాతిరత్నాలు’. అనుదీప్ కేవీ ఈ చిత్రానికి దర్శకత్వం అందించాడు.
1 / 5
మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్.. స్వప్న సినిమాస్ బ్యానర్పై ఈ నిర్మించాడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయింది.
2 / 5
తిరుమల వచ్చిన నవీన్ పోలిశెట్టి ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు చక్కెర పొంగలి దొరుకుంతుందా లేదా అనే సందేహంతో తిరుమలకు వచ్చాననీ, కానీ స్వామివారు చక్కెర పొంగలి దక్కేలా చేసి తమని ఆశీర్వదించాడని అన్నాడు.
3 / 5
జాతి రత్నాలు సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. థియేటర్లలో జాతి రత్నాలు నవ్వుల పువ్వులు పూయిస్తున్నారన్నారు. స్వామివారి ఆశీస్సులతో విజయోత్సవ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
4 / 5
ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలలో నటించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొతం చేసుకుంది.