
ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. దర్శకుడిగా మలయాళ ఇండస్ట్రీకి పాన్ ఇండియా గుర్తింపు తీసుకు రావటంతో పాటు మల్టీ లింగ్యువల్ స్టార్గా సౌత్ నార్త్ ఇండస్ట్రీలను కవర్ చేస్తున్నారు ఈ స్టార్ హీరో.

రీసెంట్గా మోహన్లాల్ హీరోగా నటించిన ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నఋ పృథ్వీరాజ్. ఇది లూసిఫెర్ సీక్వెల్గా తెరకెక్కింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా.

ఇప్పుడు టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో నటుడిగా వరుస సినిమాలు చేస్తున్న ఈ మలయాళ నటుడు, ఇప్పుడు దర్శకుడిగానూ టాలీవుడ్లో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఓ తెలుగు టాప్ స్టార్ హీరోతో తన డైరెక్షన్లో సినిమా ప్లాన్ చేస్తున్నారు పృథ్వీరాజ్. అయితే ఆ తెలుగు హీరో ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సలార్ సినిమా టైమ్లో ప్రభాస్తో పృథ్వీరాజ్కు మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. దీంతో డార్లింగ్తోనే సినిమా ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది.

ప్రజెంట్ ఎస్ఎస్ఎంబీ 29లో మహేష్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు ఈ మలయాళ స్టార్. మరి ఈ షూటింగ్ టైమ్లో మహేష్కు కథ వినిపించి ఉంటారా అన్న డౌట్స్ కూడా రెయిజ్ అవుతున్నాయి. వీళ్లిద్దరు కాక మరో హీరోనైనా ట్రై చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మరి పృథ్వీరాజ్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.