
2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న మానుషి చిల్లర్ తర్వాత నటిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ వరస ఆఫర్స్తో దూసుకెళ్తుందని చాలా మంది భావించారు. కానీ ఈ అమ్మడు సరైన హిట్ ఒక్కటి కూడా అందుకోలేకపోతుంది.

ఈ చిన్నది దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ అనే సినిమా ద్వారా వెండితెరపైకి అడుగు పెట్టింది. ఈ మూవీ 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలింది.

ఈ ముద్దుగుమ్మకు మొదటి సినిమానే ఫెయిల్యూర్ ఇచ్చింది అనుకుంటే, తర్వాత విక్కీ కౌశల్ ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.

ఇలా ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రావడం లేదు. ఎన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకోలేకపోతుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ తాజాగా వైట్ శారీలో మెస్మరైజింగ్ లుక్స్తో దర్శనం ఇచ్చింది. అచ్చం పాలరాతి శిల్పంలా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తుంది. దీంతో మానుషి వైట్ చీరలో బ్యూటిఫుల్గా ఉన్నావంటూ తమ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.