
హీరోయిన్ నభా నటేష్.. 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2019లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నభా నటేష్ పేరు మారుమోగింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా. కానీ అనుహ్యంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంది.

కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లో నటించింది.

2021లో ఈ అమ్మడుకు యాక్సిడెంట్ జరిగిందట. దీంతో కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ సరసన స్వయంభు మూవీలో నటిస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.