
8 మే 1995న తమిళనాడులోని ఈరోడ్లో పుట్టి పెరిగింది అందాల భామ ఐశ్వర్య మీనన్. ఈ వయ్యారి కుటుంబం కేరళలోని చెందమంగళానికి చెందినది. వృత్తి నిమిత్తం తమిళనాడుకి వలస వచ్చింది. ఇక్కడే ఈమె జన్మించింది.

ఆమె ఈరోడ్లోని భారతి విద్యాభవన్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆమె ఈరోడ్లోని వెల్లలార్ మెట్రిక్యులేషన్ స్కూల్లో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించింది. ఆమె SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది.

ఆమె 2012లో తమిళ టీవీ సీరియల్ ‘తేండ్రల్.’లో శృతి పాత్రను పోషించడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం వంటి వివిధ భాషలలో పనిచేసింది.

2012లో సిద్దార్థ్, అమల పాల్ జంటగా నటించిన కధలిల్ సోదప్పువదు యెప్పడి (తెలుగులో లవ్ ఫెయిల్యూర్) అనే తమిళ రొమాంటిక్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో సినీ అరంగేట్రం చేసింది. తర్వాత 2013లో ఆపిల్ పెన్నే అనే తమిళ చిత్రంలో లీడ్ రోల్ చేసింది. తర్వాత తీయ వేలై సెయ్యనుం అనే చిత్రంలో నటించింది.

2013లో దసవల అనే చిత్రంలో కన్నడలో పరిచయం అయింది. 2014లో నమో భూతాత్మ అనే మరో కన్నడ చిత్రంలో చేసింది. తర్వాత 2016లో మాన్సూన్ మంగోస్ సినిమాతో మలయాళంలో తొలిసారి నటించింది. 2023లో యంగ్ నిఖిల్ సరసన స్పై అనే చిత్రంతో తెలుగులో పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.