
డిసెంబర్ నెల బాలీవుడ్కు కీలకంగా మారింది. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న నార్త్ సినిమా ఇయర్ ఎండింగ్లో బిగ్ ఫైట్ను ఫేస్ చేయబోతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఒకే నెలలో మూడు వారాల పాటు బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ తప్పేలా లేదు.

ప్రజెంట్ ఇండియన్ ఆడియన్స్ను టెన్షన్ పెడుతున్న బిగ్ క్లాష్ సలార్, డంకీ. రెండు భారీ చిత్రాలు ఒకే డేట్కు ఆడియన్స్ ముందుకు వస్తుండటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాల్లోనూ ఈ క్లాష్ ఇంట్రస్టింగ్గా మారింది. అసలు ఈ రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్లు సరిపోతాయా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

డిసెంబర్ మొదటి వారంలోనే బిగ్ ఫైట్కు తెరలేపుతోంది బాలీవుడ్. మోస్ట్ అవెయిటెడ్ యానిమల్ సినిమాను డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. కానీ అదే రోజు విక్కీ కౌషల్ లీడ్ రోల్లో రూపొందుతున్న బయోపిక్ సామ్ బహద్దూర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెకండ్ వీక్లోనూ క్లాష్ తప్పేలా లేదు. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ అదే రోజు సిద్దార్థ్ మల్హోత్రా లీడ్ రోల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ యోధా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

.ఒకే నెలలో మూడు వారాల పాటు బాక్సాఫీస్ బిగ్ క్లాష్ను ఫేస్ చేస్తుండటం బీటౌన్లోనే కాదు నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ సినిమాలు అన్ని చెప్పిన టైమ్కు ఆడియన్స్ ముందుకు వస్తాయా... లేక రిలీజ్ టైమ్కు డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటాయా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.