
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లోకి సరికొత్త హార్రర్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. అదే జరణ్. హృషికేష్ గుప్త రాసి, దర్శకత్వం వహించిన ఈ మూవీ జీ5లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్ ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ పై నిర్మించారు.

ఇందులో అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిషోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోష్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

రాధ (అమృత శుభాష్), తన కుమార్తె సయీ (అవనీ జోషి)తో కలిసి తన పూర్వికుల ఇంటికి వెళ్లడంతో సినిమా కథ మొదలవుతుంది. ఆ ఇంటికి వెళ్లిన తర్వాత రాధకు అక్కడ దొరికిన ఓ పాత బొమ్మ కారణంగా.. ఆమెకు గతంలో తనకు ఎదురైన వింత అనుభవాలను గుర్తు చేసుకుంటుంది.

ఆ తర్వాత రాధ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ? అసలు ఆమె ఎక్కడకు వెళ్లింది...? తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. రొటిన్ హార్రర్ మూవీలా కాకుండా మానసిక ప్రవృత్తికి అద్దం పడుతుంది. ఈ మూవీలోని ఒక్కో సీన్ ఆధ్యంతం భయాన్ని కలిగిస్తుంది.

ఈ చిత్రంలోని నటీనటుల భావోద్వేగాలు, పెర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఇందులో అమృత శుభాష్ యాక్టింగ్ సినిమాకే హైలెట్. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.