
యానిమల్ సినిమాతో ఓవర్నైట్ సెన్సేషన్ అయిపోయిన త్రిప్తి డిమ్రికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఎక్కడికెళ్లినా.. తనను అందరూ... ఓ వరుసతో పిలవడమే తనకొచ్చిన పెద్ద కష్టం అంటుంది ఈ బ్యూటీ..

రణ్బీర్ లవర్ జోయాగా... యానిమల్ సెకండ్ ఆఫ్లో వచ్చి... అందర్నీ మెస్మరేజ్ చేసిన త్రిప్తి డిమ్రి... ఇప్పుడు నేషనల్ క్రష్గా మారిపోయింది. ఈ ఫిల్మ్ మెయిన్ హీరోయిన్ రష్మిక మందననే మరిపించేసింది.

ఇక తాజాగా యానిమల్ సినిమాతో నయా నేషనల్ క్రష్గా మారిన త్రిప్తి కూడా.. ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ హీరోస్ ఇద్దరిలో యంగ్ టైగర్తో వర్క్ చేయాలని ఉందంటూ ఓపెన్ అయ్యారు.

యానిమల్ మూవీ సెన్సేషనల్ హిట్ తర్వాత... బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ బిజీగా మారిన త్రిప్తి డిమ్రి... తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫెవరెట్ హీరో జూనియార్ ఎన్టీఆర్ అంటూ చెప్పారు.

సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోతో వర్క్ చేయాలని ఉందంటూ.. హోస్ట్ ఈ బ్యూటీని అడగగా... అసలే మాత్రం ఆలోచించకుండా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పేసింది.

తన మాటలతో నెట్టింట వైరల్ అవుతూ జూనియర్ ఫ్యాన్స్ను ఎగిరి గంతేసేలా చేసింది. అంతే కాదు అన్నతో అట్లుంటది మరి..తారక్కు యానిమల్ బ్యూటీ ఫిదా... అనే కామెంట్ వచ్చేలా చేస్తోంది.