
పేరుకు వాళ్లు ముంబై ముద్దుగుమ్మలే కానీ చూపంతా మాత్రం టాలీవుడ్పైనే ఉంది. ఒక్కరో ఇద్దరో కాదు.. బాలీవుడ్ బ్యూటీస్ అంతా ఇప్పుడు తెలుగు సినిమా వైపు పరుగులు తీస్తున్నారు.

మన హీరోలు కూడా ఎక్కువగా నార్త్ హీరోయిన్స్ కావాలంటున్నారు. ఇటు ఎన్టీఆర్.. అటు రామ్ చరణ్.. హీరో ఎవరైనా జోడీ మాత్రం బాంబే భామే అంటున్నారు. తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లు నటించడం కొత్తేం కాదు.. కానీ ఈ మధ్య ప్రతీ సినిమాలోనూ బాలీవుడ్ బ్యూటీనే కనిపిస్తున్నారు.

తాజాగా సెట్స్పై ఉన్న దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్.. తర్వాత సెట్స్పైకి రానున్న రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలోనూ ఈ భామే హీరోయిన్గా నటించబోతున్నారు. వీటితో పాటు మరిన్ని సౌత్ ప్రాజెక్ట్స్లో జాన్వీ పేరు వినిపిస్తుంది.

విడుదలకు సిద్ధమైన కల్కిలో దీపిక పదుకొనే మెయిన్ హీరోయిన్ కాగా.. రెండో హీరోయిన్గా దిశా పటానీ కనిపిస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే చాలు.. కేవలం బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే నటిస్తున్నారు.

ఆదిపురుష్లో కృతి సనన్.. సాహోలో శ్రద్ధా కపూర్.. ఇలా నార్త్ బ్యూటీస్కే ఓటేస్తున్నారు ప్రభాస్ దర్శకులు. వాళ్ల వల్ల పాన్ ఇండియన్ అప్పీల్ ఉంటుంది. తాజాగా NTR, ప్రశాంత్ నీల్ సినిమాలో అలియా భట్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

సౌత్లో డ్యాన్సులతో రౌడీ బేబీ అనిపించుకున్న సాయి పల్లవి ఇప్పుడు నార్త్ లో బిజీ అవుతున్నారు. ఓ వైపు జునైద్ ఖాన్తో లవ్స్టోరీలో నటిస్తున్నారు. మరోవైపు నితీష్ తివారి రామాయణంలో సీతమ్మతల్లిగా చేస్తున్నారు. లేడీ పవర్స్టార్ పల్లవి..