గెలిచిన ఆనందంలో ఉన్నారు కంగనా రనౌత్. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని అంటున్నారు. మనలో నిజాయతీ ఉందనిపిస్తే జనాలు ఇలాంటి సక్సెస్నే కిరీటంగా పెడతారని ఆనందంగా చెబుతున్నారు.
పొలిటికల్గా ఆమె చెబుతున్న విషయాల సంగతి సరే.. సినిమాల పరంగా ఆమె ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు చేసేశారు కంగనా రనౌత్.
దక్షిణాది సినీ పరిశ్రమను ప్రశంసించడానికి ముందుకొచ్చిన నార్త్ సెలబ్రిటీల్లో కంగనా రనౌత్ది ఫస్ట్ ప్లేస్. ఇక్కడి టెక్నీషియన్లను, డిసిప్లిన్ని, ప్రతిభను మెచ్చుకోవడానికి ఎప్పుడూ ముందుండేవారు కంగనా రనౌత్.
ఎన్నికల హడావిడి ముగియటంతో మళ్లీ సినిమాల మీద ఫోకస్ చేశారు కంగనా రనౌత్. తను స్వయంగా డైరెక్ట్ చేసిన కాంట్రవర్షియల్ మూవీ ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ను లాక్ చేశారు. అంతేకాదు ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలోనూ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
ఇప్పటివరకైతే కంగనకు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నది ఎమర్జెన్సీ మాత్రమే. ఆ తర్వాత కూడా సినిమాలు చేయడానికి ఆమె దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి.
మరి వాటి సంగతేంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. తేజస్ సినిమా రిలీజ్ టైమ్లో అయోధ్య గురించి రీసెర్చి చేస్తున్నానని సినిమా చేస్తానని ప్రకటించారు కంగనా రనౌత్.
సీత కేరక్టర్ ప్రధానంగా కంగన కోసం స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. మరి ఈ సినిమాలను పూర్తి చేశాక మేకప్ వేసుకోవడం మానేస్తారా? లేకుంటే ఈ సబ్జెక్టులకు నిర్మాతగా వ్యవహరిస్తారా? అనేది ఇంట్రస్టింగ్ డిస్కషన్.