తుపాకుల మధ్య అందమైన ప్రేమ కథలు.. ఇదే ప్రెజెంట్ ట్రెండ్ అంటున్న మేకర్స్
ప్రస్తుతం సినిమా స్క్రీన్ మీద వీరుల కతలు అనేక కథలు వినిపిస్తున్నాయి.. అయితే ఇదే ఆర్మీ బ్యాక్ డ్రాప్లో లో ఇంట్రస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నారు మేకర్స్.. ఇది ఇలా ఉంటె ఈ ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాల్లో ఎక్కువగా విషాదాంతాలే ఉంటున్నాయి. తుపాకుల మధ్య అందమైన ప్రేమ కథలను చూపిస్తున్న మేకర్స్, వాటిని కన్నీటితో ముగిస్తున్నారు.
Updated on: Oct 27, 2024 | 6:28 PM

ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద వీరుల కథలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఇంట్రస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే మిలటరీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో ఎక్కువగా విషాదాంతాలే ఉంటున్నాయి. తుపాకుల మధ్య అందమైన ప్రేమ కథలను చూపిస్తున్న మేకర్స్, వాటిని కన్నీటితో ముగిస్తున్నారు.

రీసెంట్ టైమ్స్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ప్రేమకథ సీతారామమ్. దుల్కర్ సల్మాన్ హీరోగా ఆర్మీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో బిగ్ హిట్ అయ్యింది. ఓ కావ్యం లాంటి ప్రేమకథతో ఆడియన్స్ను కట్టిపడేసిన దర్శకుడు, సినిమాను విషాదాంతంగా ముగించి కన్నీరు పెట్టించారు.

టాలీవుడ్ మేకర్స్ రూపొందించిన మరో పాన్ ఇండియా ప్రేమకథ మేజర్. బయోగ్రాఫికల్ మూవీగా తెరకెక్కిన ఈ కథలో ముంబై టెర్రర్ ఎటాకే మెయిన్ ప్లాట్ అయినా... మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్లోని ప్రేమకథను కూడా అద్భుతంగా చూపించారు. కానీ ఈ కథ కూడా విషాదాంతంగానే ముగిసింది.

తాజాగా అమరన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్. కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాలో హీరో ఆర్మీ మేజర్ రోల్లో కనిపించబోతున్నారు. అదే సమయంలో ఆయన పర్సనల్ లైఫ్కు సంబంధించిన సీన్స్ కూడా చూపించారు. ఈ సినిమాలో కూడా నెగెటివ్ ఎండింగే చూపించబోతున్నారు.

అసలు ఈ ట్రెండ్ మొదలైంది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ షేర్షా మూవీతో. సిద్ధార్థ్ మల్హోత్రా, కిరాయా అద్వానీ జంటగా తెరకెక్కిన షేర్షా, నార్త్ బాక్సాఫీస్ను షేక్ చేసింది. భాషతో సంబంధం లేకుండా ఈ కథకు సౌత్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం, ఆ సినిమా క్లైమాక్సే. విషాదాంతంగా ముగిసే షేర్షా కథ ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయింది. అందుకే ఇప్పుడు ఆ ట్రెండ్ బాక్సాఫీస్ను రూల్ చేస్తోంది.




