
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం ఉచిత విత్ డ్రా పరిమితిలో మార్పులు చేసింది. ఉచిత లావాదేవీల సంఖ్యను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఎస్బీఐ షాకిచ్చింది. నెలవారీ ఏటీఎం విత్ డ్రాయల్ రూల్స్లో కీలక మార్పులు చేసింది. శాలరీ అకౌంట్ హోల్డర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో జరిపే ఉచిత లావాదేవీల సంఖ్యను సగానికి కుదించింది.

గతంలో శాలరీ అకౌంట్ కస్టమర్లకు నెలకు 10 ఫ్రీ ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు 5కు తగ్గించింది. నెలకు ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఐదు దాటిన తర్వాత ప్రతి లావాదేవీపై రూ.23(+GST) ఛార్జీ విధించనున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. ఇక నాన్-క్యాష్ ట్రాన్సాక్షన్లపై రూ. 11(+GST) విధించనుంది.

అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విత్ డ్రా రూల్స్ అమల్లోకి రానున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ సవరణలు ఇతర బ్యాంకులు ఏటీఎంల వద్ద డెబిట్ కార్డు ఉపయోగించి చేసే లావాదేవీలకు వర్తిస్తాయి. ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్న అన్ని వేరియంట్లకు ఇవి వర్తిస్తాయి. ఇక ఎస్బీఐ ఏటీఎంలో నెలకు 10 లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో 5కి తగ్గించారు.

మెట్రో, నాన్ మెట్రో నగరాలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల ఈ కొత్త నియమాలు వర్తించనున్నాయి. ఇక శాలరీ అకౌంట్ లేని సాధారణ ఖాతాదారులకు ప్రస్తుతం ఉన్న ఐదు ఉచిత లావాదేవీల పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు. ఐదు వరకు ఉచితంగా మిగతా కస్టమర్లు నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత ఛార్జీలు విధిస్తారు.

ఎస్బీఐ ఇటీవల బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు నగదు విత్ డ్రా రూల్స్లో మార్పులు చేసింది. కేవలం నెలకు నాలుగు లావాదేవీలు మాత్రమే ఉచితంగా నిర్వహించుకునే అవకాశముంది. నాలుగు లావాదేవీలు పూర్తయిన తర్వాత ప్రతీ లావాదేవీకి రూ.15+జీఎస్టీ చెల్లించాలి. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ రానున్నాయి.