AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కేంద్రం అద్బుత స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. ఎలా చేరాలంటే..?

కేంద్ర ప్రభుత్వం పీఎం అటల్ పెన్షన్ యోజన పేరుతో పెన్షన్ స్కీమ్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు కోట్లాదిమంది ఈ పథకంలో చేరారు. కానీ ఎక్కువమంది నెలకు రూ.వెయ్యి పెన్షన్ పొందే ప్లాన్ ఎంచుకున్నారు. తక్కువమంది మాత్రమే రూ.5 కేటగిరీ ఎంచుకున్నారు.

Venkatrao Lella
|

Updated on: May 21, 2026 | 2:09 PM

Share
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ స్కీమ్ వంటి పథకాలను అందిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత నెల నెలా పెన్షన్ పొందే సౌకర్యం కల్పిస్తోంది. ఈ పథకం పేరే ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన. 2019లో మే 9న ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో ఎలా చేరాలి అనేది చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ స్కీమ్ వంటి పథకాలను అందిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత నెల నెలా పెన్షన్ పొందే సౌకర్యం కల్పిస్తోంది. ఈ పథకం పేరే ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన. 2019లో మే 9న ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో ఎలా చేరాలి అనేది చూద్దాం.

1 / 5
ఇప్పటివరకు 9 కోట్ల మందికిపైగా ప్రజలు అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరారు. అయితే  87 శాతం మంది కేవలం ప్రతీ నెలా రూ.వెయ్యి కనీస పెన్షన్ పొందే ఆప్షన్ మాత్రమే ఎంచుకున్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 135 లక్షల మంది ఈ పెన్షన్ పథకంలో చేరారు. పథకంలో చేరిన వారిలో 87 శాతం మంది రూ.వెయ్యి పెన్షన్ పొందే ఆప్షన్ ఎంచుకోగా.. 8 శాతం మంది రూ.5 వేల కేటగిరీ ఎంచుకున్నారు.

ఇప్పటివరకు 9 కోట్ల మందికిపైగా ప్రజలు అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరారు. అయితే 87 శాతం మంది కేవలం ప్రతీ నెలా రూ.వెయ్యి కనీస పెన్షన్ పొందే ఆప్షన్ మాత్రమే ఎంచుకున్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 135 లక్షల మంది ఈ పెన్షన్ పథకంలో చేరారు. పథకంలో చేరిన వారిలో 87 శాతం మంది రూ.వెయ్యి పెన్షన్ పొందే ఆప్షన్ ఎంచుకోగా.. 8 శాతం మంది రూ.5 వేల కేటగిరీ ఎంచుకున్నారు.

2 / 5
మొత్తం 9 కోట్ల మంది పథకంలో చేరగా. 79.4 కోట్ల మంది రూ.వెయ్యి పెన్షన్ ప్లాన్ ఎంచుకోగా.. 7 కోట్ల మంది 5 వేల కేటగిరీలో ఉన్నారు. ఇక 26 లక్షల మంది రూ.2 వేల ప్లాన్‌లో ఉండగా.. 12 లక్షల మంది రూ.3 వేల కేటగిరీలో ఉన్నారు. ఇక 4,58,698 మంది రూ.4 వేల కేటగిరీలో ఉన్నారు. అయితే ప్రజలు అధిక పెన్షన్ కేటగిరీ ఎంచుకునేలా ప్రోత్సహించాలని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు ఆర్ధిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు.

మొత్తం 9 కోట్ల మంది పథకంలో చేరగా. 79.4 కోట్ల మంది రూ.వెయ్యి పెన్షన్ ప్లాన్ ఎంచుకోగా.. 7 కోట్ల మంది 5 వేల కేటగిరీలో ఉన్నారు. ఇక 26 లక్షల మంది రూ.2 వేల ప్లాన్‌లో ఉండగా.. 12 లక్షల మంది రూ.3 వేల కేటగిరీలో ఉన్నారు. ఇక 4,58,698 మంది రూ.4 వేల కేటగిరీలో ఉన్నారు. అయితే ప్రజలు అధిక పెన్షన్ కేటగిరీ ఎంచుకునేలా ప్రోత్సహించాలని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు ఆర్ధిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు.

3 / 5
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పున:పరిశీలిస్తోంది. భవిష్యత్తులో పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయాన్ని  పీఎఫ్ఆర్‌డీఏ చైర్మన్ ఎస్. రామన్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదికను అందిస్తామని తెలిపారు. అధిక పెన్షన్ కేటగిరీ ఎంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. దీనిపై బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పున:పరిశీలిస్తోంది. భవిష్యత్తులో పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశముందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పీఎఫ్ఆర్‌డీఏ చైర్మన్ ఎస్. రామన్ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వానికి ఒక నివేదికను అందిస్తామని తెలిపారు. అధిక పెన్షన్ కేటగిరీ ఎంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. దీనిపై బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.

4 / 5
ఆదాయం పెరుగుతుండగా.. భవిష్యత్తులో ఖర్చులు మరింత పెరగనున్నాయి. దీంతో 20 నుంచి 30 ఏళ్ల తర్వాత నెలకు రూ.వెయ్యి సరిపోవు. దీంతో అధిక పెన్షన్ కేటగిరీ ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పథకంలో ప్రీమియం చాలా తక్కువగా ఉండటం వల్ల ఎక్కువమంది అధిక పెన్షన్ ప్లాన్ ఎంచుకుంటే మంచిదని కేంద్రం సూచిస్తోంది.

ఆదాయం పెరుగుతుండగా.. భవిష్యత్తులో ఖర్చులు మరింత పెరగనున్నాయి. దీంతో 20 నుంచి 30 ఏళ్ల తర్వాత నెలకు రూ.వెయ్యి సరిపోవు. దీంతో అధిక పెన్షన్ కేటగిరీ ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పథకంలో ప్రీమియం చాలా తక్కువగా ఉండటం వల్ల ఎక్కువమంది అధిక పెన్షన్ ప్లాన్ ఎంచుకుంటే మంచిదని కేంద్రం సూచిస్తోంది.

5 / 5
Follow Us