- Telugu News Photo Gallery Business photos Gold touches life time high at rs 96450 silver settles at 2500
Gold Price: 24 గంటల్లోనే బంగారం ధర రికార్డ్.. లక్షకు చేరువలో పసిడి పరుగులు
Gold Price: దేశంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ట్రంప్ నిర్ణయం తర్వాత రానున్న రోజుల్లో 56 వేలకు తగ్గవచ్చని నిపుణులు భావించినప్పటికీ మళ్లీ పరుగులు పెడుతోంది. బంగారం ధర రికార్డ్ సృష్టిస్తోంది. 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో వెళ్తోంది. ఒక విధంగా చెప్పాలంటే లక్షకు అతి సమీపంలో ధర కొనసాగుతోంది..
Updated on: Apr 15, 2025 | 9:05 PM

బంగారం ధరలు రికార్డు స్థాయిలో వెళ్తోంది. 24 గంటల్లోనే మరోసారి బంగారాన్ని రికార్డు స్థాయి సృష్టించింది. బంగారం లక్ష రూపాయలకు చేరుకోవడానికి రూ.3,550 మాత్రమే అవసరం. అక్షయ తృతీయకు ముందు ఢిల్లీలో బంగారం ధరలు లక్ష రూపాయలకు చేరుకుంటాయా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు వెండి ధరలు కూడా రూ.2,500 పెరిగాయి. అయితే, దేశ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ డేటా ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.50 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.96,450కి చేరుకుంది. సోమవారం నాడు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.50 తగ్గి రూ.96,400 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.50 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.96,000కు చేరుకుంది. అంతకుముందు దాని ముగింపు ధర 10 గ్రాములకు రూ.95,950గా ఉంది.

ఇదిలా ఉండగా పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో వెండి ధర కిలోకు రూ.2,500 పెరిగి రూ.97,500కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం ఔన్సుకు $13.67 లేదా 0.43 శాతం పెరిగి $3,224.60కి చేరుకుంది. ఆసియా మార్కెట్లలో స్పాట్ వెండి ఔన్సుకు స్వల్పంగా తగ్గి $32.32కి చేరుకుంది.

డాలర్ బలహీనపడటం, అమెరికా వాణిజ్య విధానంపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి దగ్గరగా స్థిరంగా ఉన్నాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) చింతన్ మెహతా అన్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే లేదా ఆర్థిక పరిస్థితులు బలహీనపడితే సెంట్రల్ బ్యాంక్ ఎలా స్పందిస్తుందనే దానిపై సూచనల కోసం పెట్టుబడిదారులు బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ జరగనున్న విలేకరుల సమావేశంపై నిశితంగా దృష్టి పెడతారని మెహతా అన్నారు.

HDFC సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్-కమోడిటీ సౌమిల్ గాంధీ ప్రకారం.. మంగళవారం విడుదలయ్యే NY ఎంపైర్ స్టేట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్తో సహా US స్థూల ఆర్థిక డేటా కోసం వ్యాపారులు ఇప్పుడు వేచి ఉన్నారు. దీనితో పాటు మార్కెట్ పాల్గొనేవారు మరిన్ని వివరాల కోసం ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సభ్యుడు థామస్ బార్కిన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) అధ్యక్షురాలు క్రిస్టీన్ లగార్డ్ ప్రసంగం కోసం కూడా వేచి ఉంటారు. అయితే, ప్రధాన దృష్టి సుంక సంబంధిత పరిణామాలపైనే ఉందని, ఇది బులియన్ ధరలపై ప్రభావం చూపుతుందని గాంధీ అన్నారు.





























