Budget 2024: బడ్జెట్ వేళ ఆసక్తికర దృశ్యం.. నిర్మలమ్మకు తీపి తినిపించిన రాష్ట్రపతి ముర్ము
దేశ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణాలు రానే వచ్చేశాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అయితే సభలోకి నిర్మలమ్మ అడుగు పెట్టడానికి ముందు ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. అంతేకాదు నిర్మలమ్మకు స్వయంగా స్వీట్ ని తినిపించి నోరు తీపి చేసి మరీ విశేష చెప్పారు ప్రధమ పౌరురాలు.
Most Read Stories