
నేటి కాలంలో స్మార్ట్ఫోన్లు మన జీవితంలో ఒక భాగంగా మారాయి. ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండేందుకు Wi-Fi, బ్లూటూత్లను ఆఫ్ చేయాలని చాలామంది చెబుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల నిజంగా బ్యాటరీ ఆదా అవుతుందో లేదో ఇక్కడ తెలుసుకుందాం.. మొదట్లో స్మార్ట్ఫోన్లలో, బ్లూటూత్, వై-ఫైలను ఆన్లో ఉంచడం వల్ల బ్యాటరీ వేగంగా ఖాళీ అయ్యేది. అయితే ఆధునిక స్మార్ట్ఫోన్లు ఇప్పుడు అధునాతన చిప్సెట్లను ఉపయోగిస్తున్నాయి. ఇవి బ్యాటరీపై పెద్దగా ప్రభావం చూపవు.

పాత ఫోన్లలో ఈ చిప్సెట్ లేదు. కాబట్టి బ్లూటూత్, వైఫై వంటి ఫీచర్లు బ్యాంక్ గ్రౌండ్లో నడుస్తున్నప్పటికీ మీ ఫోన్ను తరచుగా ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. ప్రస్తుత స్మార్ట్ఫోన్లు బ్లూటూత్ లో ఎనర్జీ (BLE) టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయి. ఈ టెక్నాలజీ చాలా తక్కువ మొత్తంలో అంటే కేవలం 2.5 mW మాత్రమే విద్యుత్తును వినియోగిస్తుంది. హెడ్ఫోన్లు లేదా స్మార్ట్వాచ్ను ఉపయోగించనప్పుడు బ్లూటూత్ స్వయంచాలకంగా స్లీప్ మోడ్లోకి వెళుతుంది. డేటా బదిలీ అవసరమైనప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది బ్యాటరీ వినియోగాన్ని సున్నాకి తగ్గిస్తుంది.

మీ ఫోన్ ఇంట్లో లేదా ఆఫీస్లో Wi-Fi కి కనెక్ట్ చేయబడి ఉంటే అది మొబైల్ డేటా (4G/5G) కంటే చాలా తక్కువ విద్యుత్తును ఉపయోగిస్తుంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీ ఫోన్ కొత్త నెట్వర్క్ల కోసం వెతుకుతుంది. దీనివల్ల కొంత బ్యాటరీ ఖర్చవుతుంది.

కానీ ఈ వ్యత్యాసం రోజుకు 1 నుంచ 2 శాతం మాత్రమే. కాబట్టి Wi-Fi ని ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ ఎక్కువగా ఆదా కాదు. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంటే అది బ్లూటూత్ లేదా Wi-Fi కాకుండా మరేదైనా కారణం కావచ్చు. అధిక బ్రైట్నెస్ బ్యాటరీకి అతిపెద్ద శత్రువు. అలాగే సోషల్ మీడియా లేదా లొకేషన్ ట్రాకింగ్ యాప్లు నిరంతరం బ్యాటరీని వినియోగిస్తాయి. సిమ్ కార్డ్ నెట్వర్క్ తక్కువగా ఉంటే ఫోన్ టవర్ను కనుగొనడానికి అది ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది.

ఆధునిక స్మార్ట్ఫోన్లలో బ్లూటూత్, Wi-Fiలను ఎల్లప్పుడూ ఆన్లో ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్పై పెద్దగా ప్రభావం ఉండదు. ఇది Find My Device, స్మార్ట్ గాడ్జెట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను మెరుగ్గా పని చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుండి మీరు బ్యాటరీ లైఫ్ గురించి చింతించకుండా ఈ ఫీచర్లను ఉపయోగించండి.