
అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ అరటిపండు చాలా ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

కానీ అరటిపండ్లు ఆరోగ్యానికి నిజంగానే మేలు చేస్తాయని.. కానీ మోతాదుకు మించి తింటే మాత్రం అనర్ధాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే నియమం అరటిపండ్లకు వర్తిస్తుంది. అరటిపండు ఎక్కువగా తింటే కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

అరటిపండు అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో ఒకటి. అవి ఏడాది పొడవునా అన్ని ప్రాంతాల్లో అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటాయి. ఇది ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలతో నిండి ఉంటుంది. అరటిపండులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.

అరటిపండ్లు రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతాయంటే.. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్తోపాటు చక్కెర శాతం ముఖ్యకారణం. ఎందుకంటే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. అయితే వీరు అరటి పండు మితంగా తింటే సరిపోతుంది.

అరటిపండులో చక్కెర, కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర ఖచ్చితంగా పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.