
అంతేకాకుందా పొటాషియం శరీరంలో ద్రవం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఈ ఖనిజం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. బీపీ కంట్రోల్ చేయడానికి అరటి పండ్లు తీసుకుంటే ఎంతోమేలు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: పచ్చి అరటిపండ్లలో ఫైబర్, రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జీర్ణవ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది: పచ్చి అరటిపండు తీసుకోవడం షుగర్ పేషెంట్లకు మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు మధుమేహ సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: పచ్చి అరటిపండు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటిపండులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.. ఇది పెరుగుతున్న కొలెస్ట్రాల్ను నియంత్రించగలదు.

అధిక రక్తపోటు ఉన్న వారు అధిక ఉప్పు గల ఆహారాలను పూర్తిగా నివారించాలి. వాస్తవానికి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు ముప్పు తగ్గుతుంది. పొటాషియం మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మూత్రం ద్వారా శరీరం నుంచి అదనపు సోడియంను బయటకు పంపుతుంది.

అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ అరటిపండు తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని సులభంగా నివారించవచ్చు. అధిక రక్తపోటు నివారణకు ప్రతిరోజూ 2 అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే 1 వారంలోపు రక్తపోటును 10 శాతం వరకు తగ్గిస్తుంది.