Weather: ఉత్తరభారతావనిలో చలిగాలులు.. దేశవ్యాప్తంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..ఐఎండీ అంచనా!

రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాలు చలిగాలుల బారిన పడే అవకాశం ఉంది. ఉత్తర భారతం, సౌరాష్ట్ర, కచ్‌లలో వచ్చే బుధ, గురు వారాల్లో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Weather: ఉత్తరభారతావనిలో చలిగాలులు.. దేశవ్యాప్తంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..ఐఎండీ అంచనా!
Weather Cold Waves In North India

Updated on: Dec 17, 2021 | 7:08 AM

Weather: రానున్న 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాలు చలిగాలుల బారిన పడే అవకాశం ఉంది. ఉత్తర భారతం, సౌరాష్ట్ర, కచ్‌లలో వచ్చే బుధ, గురు వారాల్లో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని ఆ శాఖ తన రోజువారీ బులెటిన్‌లో పేర్కొంది. డిసెంబర్ 17 నుంచి 21 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, సౌరాష్ట్ర, కచ్‌లలో చలిగాలులు వీచే అవకాశం ఉంది. డిసెంబర్ 18 నుండి 21 వరకు, ఉత్తర రాజస్థాన్‌లో.. డిసెంబర్ 19 నుండి 21 వరకు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి అలాగే ఉంటుంది.

రాబోయే 4 నుండి 5 రోజులలో, వాయువ్య.. మధ్య భారతదేశం మినహా గుజరాత్‌లోని చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం ఉంది. ఈ పతనం తూర్పు భారతదేశం.. మహారాష్ట్రపై 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. పంజాబ్ అలాగే హర్యానాలో రాబోయే రెండు రోజులు దట్టమైన లేదా చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 17న వాయువ్య రాజస్థాన్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో కూడా చాలా దట్టమైన పొగమంచు పరిస్థితులు ఏర్పడతాయి.

ఢిల్లీలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 8.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తేలికపాటి మేఘాలు ఆవరించి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా అంచనా వేసింది. దీని కారణంగా వచ్చే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు కొన్ని డిగ్రీలు తగ్గుతుంది. ఢిల్లీలో గురువారం రోజు గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 అంటే ఉదయం 8 గంటలకు చాలా పేలవంగా ఉంది.

గుల్‌మార్గ్‌లో సీజన్‌లో అత్యంత చలి రోజు..

ఉత్తర కాశ్మీర్‌లో చలి తీవ్రత పెరిగింది. పర్యాటక ప్రాంతం గుల్‌మార్గ్‌లో ఇప్పటివరకూ ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. స్కీయింగ్ రిసార్ట్‌లో పాదరసం మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. అయితే, లోయ దక్షిణ.. మధ్య ప్రాంతాలలో కొంత ఉపశమనం ఉంది. శ్రీనగర్‌లో బుధ, గురువారాల మధ్య రాత్రి కనిష్టంగా మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. గత రాత్రి మైనస్ 3.9 డిగ్రీల సెల్సియస్‌తో పోలిస్తే ఇది 1.8 డిగ్రీలు పెరిగింది. ఈ శీతాకాలంలో వేసవి రాజధానిలో అత్యంత శీతల ఉష్ణోగ్రత నమోదైంది. అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంప్ అయిన పహల్గామ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 6.9 డిగ్రీల సెల్సియస్.

రానున్న మూడు రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌, లడఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్‌లో వచ్చే వారంలో మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

ఇవి కూడా చదవండి: Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్‌.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

NIFT Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. రూ. 50 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

Tecno Spark 8T: ఇండియన్‌ మార్కెట్లోకి మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. రూ. 9వేల లోపే అదిరిపోయే టెక్నో స్పార్క్‌ 8టీ..

Loading...
Unable to load recommendations.
Follow Us