17 రోజుల తర్వాత వెలుతురు చూస్తున్న 41 మంది కార్మికులు.. ఏ రాష్ట్రం నుండి ఎంతమంది ఉన్నారంటే?

ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలను సురక్షితంగా రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ దాదాపు విజయవంతమైంది. డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. అందులో చిక్కుకున్న కార్మికులు ఎప్పుడైనా బయటకు రావచ్చు. సంఘటనా స్థలానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి.

17 రోజుల తర్వాత వెలుతురు చూస్తున్న 41 మంది కార్మికులు..  ఏ రాష్ట్రం నుండి ఎంతమంది ఉన్నారంటే?
Uttarkashi Tunnel Rescue

Updated on: Nov 28, 2023 | 3:36 PM

ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలను సురక్షితంగా రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్ దాదాపు విజయవంతమైంది. డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యాయి. అందులో చిక్కుకున్న కార్మికులు ఎప్పుడైనా బయటకు రావచ్చు. సంఘటనా స్థలానికి ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. కూలీలను త్వరగా ఆస్పత్రికి తరలించేందుకు గ్రీన్ కారిడార్ పనులు పూర్తయ్యాయి. కార్మికులు బయటకు వచ్చిన వెంటనే ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపనున్నారు.

రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాత, సొరంగం నుంచి బయటకు వచ్చే కార్మికులందరినీ చిన్యాలి సౌద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఒక మంచం కేటాయించారు. ప్రతి ఒక్కరికీ మానిటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాట్లు చేశారు. అంతే కాదు ఎలాంటి మందులు, ఇంజక్షన్ల కొరత లేకుండా చూసేందుకు మొత్తం స్టాక్‌ను ఇక్కడ అందుబాటులో ఉంచారు.

ఈ మొత్తం ఆపరేషన్‌ను కేంద్ర మంత్రి జనరల్ VK సింగ్, PMO మాజీ సలహాదారు భాస్కర్ ఖుల్బే, మాజీ ఇంజనీర్-ఇన్-చీఫ్, BRO DG లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ లు సిల్క్యారా సొరంగం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సొరంగం లోపల పైపులు వేసే పని పూర్తయిందని, కార్మికులందరినీ కాపాడుతామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కార్మికులకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం.

ఏయే రాష్ట్రానికి చెందిన ఎంత మంది కార్మికులు ఉన్నారంటే..!

ఉత్తరాఖండ్ – 2

హిమాచల్ ప్రదేశ్- 1

ఉత్తరప్రదేశ్ – 8

బీహార్ – 5

పశ్చిమ బెంగాల్ – 3

అస్సాం – 2

జార్ఖండ్  – 15

ఒడిశా  – 5

సొరంగంలో చిక్కుకున్న కార్మికులు:

గబ్బర్ సింగ్ నేగి, ఉత్తరాఖండ్

సబా అహ్మద్, బీహార్

సోనూ షా, బీహార్

మనీర్ తాలూక్దార్, పశ్చిమ బెంగాల్

సెవిక్ పఖేరా, పశ్చిమ బెంగాల్

అఖిలేష్ కుమార్, యుపి

జయదేవ్ పర్మానిక్, పశ్చిమ బెంగాల్

వీరేంద్ర కిస్కు, బీహార్

సపాన్ మండల్, ఒడిశా

సుశీల్ కుమార్, బీహార్

విశ్వజిత్ కుమార్, జార్ఖండ్

సుబోధ్ కుమార్, జార్ఖండ్

భగవాన్ బాత్రా, ఒడిశా

అంకిత్, యుపి

రామ్ మిలన్, యుపి

సత్యదేవ్, యుపి

సంతోష్, యుపి

జై ప్రకాష్, యుపి

రామ్ సుందర్, ఉత్తరాఖండ్

మంజీత్, యుపి

అనిల్ బేడియా, జార్ఖండ్

శ్రజేంద్ర బేడియా, జార్ఖండ్

సుక్రం, జార్ఖండ్

టికు సర్దార్, జార్ఖండ్

గుణోధర్, జార్ఖండ్

రంజిత్, జార్ఖండ్

రవీంద్ర, జార్ఖండ్

సమీర్, జార్ఖండ్

విశేష్ నాయక్, ఒడిశా

రాజు నాయక్, ఒడిశా

మహదేవ్, జార్ఖండ్

ముద్దు ముర్మ్, జార్ఖండ్

ధీరెన్, ఒడిశా

చమర ఉరోవ్, జార్ఖండ్

విజయ్ హోరో, జార్ఖండ్

గణపతి, జార్ఖండ్

సంజయ్, అస్సాం

రామ్ ప్రసాద్, అస్సాం

విశాల్, హిమాచల్ ప్రదేశ్

పుష్కర్, ఉత్తరాఖండ్

దీపక్ కుమార్, బీహార్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…