UP Government: ఈ సమయ సారిని తప్పనిసరి.. మహిళా ఉద్యోగులకు యోగి సర్కార్ బంపర్ ఆఫర్..

|

May 29, 2022 | 6:31 PM

Yogi Adityanath Government: యోగి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీల్లో ఉపాధి పొందే మహిళల పని వేళలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. ఫ్యాక్టరీల్లో మహిళల చేత ఉదయం 6 గంటలకు ముందు..

UP Government: ఈ సమయ సారిని తప్పనిసరి.. మహిళా ఉద్యోగులకు యోగి సర్కార్ బంపర్ ఆఫర్..
Yogi Adityanath
Follow us on

యోగి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యాక్టరీల్లో ఉపాధి పొందే మహిళల పని వేళలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. ఫ్యాక్టరీల్లో మహిళల చేత ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని ఆదేశించారు. ఒకవేళ పని చేయిస్తే ఆ మహిళలకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలను కల్పించాలని వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మే 27న జారీ చేసిన నోటిఫికేషన్‌లో మహిళ లిఖితపూర్వక సమ్మతి తెలియజేసినపుడు మినహా.. ఏ మహిళ చేత అయినా ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 7 గంటల తర్వాత పని చేయించరాదని తెలిపింది. ఒకవేళ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పని చేయించినట్లయితే, ఆ మహిళలకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలను కల్పించాలని తెలిపింది.

రాత్రి ఏడు గంటల తర్వాత కానీ, ఉదయం 6 గంటలకు ముందు కానీ పని చేయడానికి తిరస్కరించిన మహిళను ఉద్యోగం నుంచి తొలగించరాదని చెప్పింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పని చేసే మహిళలకు వారి ఇళ్ళ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి వారి ఇళ్ళకు ఉచిత రవాణా సదుపాయాన్ని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యమే కల్పించాలని తెలిపింది. అదేవిధంగా వారికి ఆహారాన్ని కూడా యాజమాన్యమే అందజేయాలని పేర్కొంది. వారికి రక్షణ కల్పించే విధంగా పర్యవేక్షణను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, బట్టలు మార్చుకునేందుకు గదులను కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో మహిళలు పని చేయవలసి వస్తే, కనీసం నలుగురు మహిళలు కలిసి ఉండేలా చూడాలని తెలిపింది.