AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాలు జరుపుతుండగా భారీ ప్రమాదం.. కుప్పకూలిన 6 ఇళ్లు..12 కి పైగా సమాధి!

ఉత్తరప్రదేశ్‌ మధురలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోవింద్ నగర్‌లో JCB ద్వారా తవ్వకాలు జరుపుతుండగా, ఒక్కసారిగా 6 ఇళ్ళు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురిని బయటకు తీశారు. చాలా మంది ఇప్పటికీ శిథిలాల కింద సమాధి అయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇళ్ళు కుచ్చా దిబ్బపై నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

తవ్వకాలు జరుపుతుండగా భారీ ప్రమాదం.. కుప్పకూలిన 6 ఇళ్లు..12 కి పైగా సమాధి!
Mathura Building Collapse
Balaraju Goud
|

Updated on: Jun 15, 2025 | 4:13 PM

Share

ఉత్తరప్రదేశ్‌ మధురలో ఘోర ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఆరు ఇళ్లు కుప్ప కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు మరణించారు. అదే సమయంలో, చాలా మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం, శిథిలాలను తొలగించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఇక్కడి ఎన్‌క్లోజర్ (ఓపెన్ ల్యాండ్)లో జేసీబీతో తవ్వకం జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కచ్చా రోడ్డుపై నిర్మించిన 6 ఇళ్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఈ ఇళ్లు కచ్చా దిబ్బపై నిర్మించారు. ఇళ్లు కూలిపోతున్న శబ్దం విని, సమీపంలో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు.

స్థానికుల సమాచారం ప్రకారం, ఆదివారం(జూన్ 15) మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 6 ఇళ్ళు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. నలుగురిని శిథిలాల నుండి బయటకు తీశారు. మరో 10-12 మంది ఇంకా శిథిలాల కింద సమాధి అయ్యి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, అధికారులు, అగ్నిమాపక దళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులను తోటారామ్ (38), ఇద్దరు సోదరీమణులు యశోద (6), కావ్య (3) గా గుర్తించారు.

కూలిపోయిన 6 ఇళ్ళు కూడా ఒక మట్టి దిబ్బపై నిర్మించినట్లు సమాచారం. ఇక్కడ జేసీబీ సహాయంతో ఖాళీ స్థలంలో తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా మట్టి కూలిపోయి, ఒక్కొక్కటిగా ఇళ్ళు శిథిలాలుగా మారాయి. ఈ సంఘటన జరిగినప్పుడు భూకంపం వచ్చినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని జనం బయటకు పారిపోయే అవకాశం కూడా లభించలేదు. పోలీసులు ప్రజలను ప్రశ్నిస్తూ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..