Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తవ్వకాలు జరుపుతుండగా భారీ ప్రమాదం.. కుప్పకూలిన 6 ఇళ్లు..12 కి పైగా సమాధి!

ఉత్తరప్రదేశ్‌ మధురలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోవింద్ నగర్‌లో JCB ద్వారా తవ్వకాలు జరుపుతుండగా, ఒక్కసారిగా 6 ఇళ్ళు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురిని బయటకు తీశారు. చాలా మంది ఇప్పటికీ శిథిలాల కింద సమాధి అయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఇళ్ళు కుచ్చా దిబ్బపై నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

తవ్వకాలు జరుపుతుండగా భారీ ప్రమాదం.. కుప్పకూలిన 6 ఇళ్లు..12 కి పైగా సమాధి!
Mathura Building Collapse
Balaraju Goud
|

Updated on: Jun 15, 2025 | 4:13 PM

Share

ఉత్తరప్రదేశ్‌ మధురలో ఘోర ప్రమాదం వెలుగులోకి వచ్చింది. ఆరు ఇళ్లు కుప్ప కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు మరణించారు. అదే సమయంలో, చాలా మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం, శిథిలాలను తొలగించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇళ్లు అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ఇక్కడి ఎన్‌క్లోజర్ (ఓపెన్ ల్యాండ్)లో జేసీబీతో తవ్వకం జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కచ్చా రోడ్డుపై నిర్మించిన 6 ఇళ్లు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఈ ఇళ్లు కచ్చా దిబ్బపై నిర్మించారు. ఇళ్లు కూలిపోతున్న శబ్దం విని, సమీపంలో నివసిస్తున్న ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చారు.

స్థానికుల సమాచారం ప్రకారం, ఆదివారం(జూన్ 15) మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 6 ఇళ్ళు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఇప్పటివరకు ముగ్గురు మరణించారు. నలుగురిని శిథిలాల నుండి బయటకు తీశారు. మరో 10-12 మంది ఇంకా శిథిలాల కింద సమాధి అయ్యి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్, అధికారులు, అగ్నిమాపక దళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులను తోటారామ్ (38), ఇద్దరు సోదరీమణులు యశోద (6), కావ్య (3) గా గుర్తించారు.

కూలిపోయిన 6 ఇళ్ళు కూడా ఒక మట్టి దిబ్బపై నిర్మించినట్లు సమాచారం. ఇక్కడ జేసీబీ సహాయంతో ఖాళీ స్థలంలో తవ్వకాలు జరుగుతున్నాయని ప్రజలు చెప్పారు. అప్పుడు అకస్మాత్తుగా మట్టి కూలిపోయి, ఒక్కొక్కటిగా ఇళ్ళు శిథిలాలుగా మారాయి. ఈ సంఘటన జరిగినప్పుడు భూకంపం వచ్చినట్లు అనిపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్లలోని జనం బయటకు పారిపోయే అవకాశం కూడా లభించలేదు. పోలీసులు ప్రజలను ప్రశ్నిస్తూ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రూ.80కోట్లు పెడితే రూ.8 కోట్లు కూడా రాలేదు.. కానీ
రూ.80కోట్లు పెడితే రూ.8 కోట్లు కూడా రాలేదు.. కానీ
IDP కోర్సులకు JNTU మంగళం.. కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు తొలగింపు!
IDP కోర్సులకు JNTU మంగళం.. కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు తొలగింపు!
Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
Hydra: సలకం చెరువులో ఓవైసీ కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే...
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం వేసుకుంటున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
పవన్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? ఆఫీసుకు పిలిచి లక్ష రూపాయలు
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
Andhrapradesh: ఇవాళ ఏపీలో పేరెంట్‌-టీచర్‌ మెగా ఈవెంట్‌...
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
యువకులకు భలే ఛాన్స్.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు ప్రకటన
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
TS Cabinet: నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం...
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
'4ఏళ్లల్లో ఏ ఒక్క ఏడాది ఇతర రాష్ట్రాల్లో చదివినా స్థానికేతరులే..'
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?
తగ్గుతున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా? తగ్గుతాయా? తులం ఎంత?