AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీవ్ర విషాదం.. 11 మంది మృతి! దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

గోండాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, 4 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వారు పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తున్న భక్తులు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

తీవ్ర విషాదం.. 11 మంది మృతి! దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
Accident
SN Pasha
|

Updated on: Aug 03, 2025 | 3:21 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని ఇటియాథోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం (ఆగస్టు 3) జరిగిన ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం కాలువలో పడిపోయింది. ప్రయాణికుల్లో పృథ్వీనాథ్ ఆలయానికి ప్రార్థనలు చేయడానికి వెళ్తున్న భక్తులు ఉన్నారు. ఈ సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మిగతా వారి పరిస్థితి విషమంగా ఉంది. బొలెరో వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

బాధితులు సిహాగావ్ గ్రామం నుండి ఖర్గుపూర్‌లోని పృథ్వీనాథ్ ఆలయంలో పవిత్ర జలం అర్పించడానికి ప్రయాణిస్తుండగా బెల్వా బహుతా సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చిక్కుకున్న SUV వాహనంలో డ్రైవర్ సహా మొత్తం 15 మంది ఉన్నారు. గ్రామస్తులు, రెస్క్యూ బృందాల సహాయంతో, మునిగిపోయిన వాహనం నుండి 11 మృతదేహాలను వెలికి తీశారు. మరో నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. వారిని వెంటనే వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలను వేగవంతం చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నివేదికల ప్రకారం గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం యోగి సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.

“గోండా జిల్లాలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధాకరం, హృదయ విదారకం. దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని, గాయపడిన వారిని సరైన చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని జిల్లా పరిపాలన అధికారులకు సూచనలు ఇవ్వబడ్డాయి. మరణించిన వారి ఆత్మలకు మోక్షం లభించాలని, దుఃఖంలో ఉన్న కుటుంబాలు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని పొందాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి!” అని సీఎం యోగి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రధాని మోదీ స్పందన..

మృతుల బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, 4 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సానుభూతి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి