Union Minister Rijiju: హిమపాతంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. స్వయంగా కారుని నెట్టుకుంటూ వెళ్లిన కిరణ్ రిజిజు

Union Minister Rijiju: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి మంత్రి కిరణ్‌ రిజిజు కాన్వాయ్‌ హిమపాతంలో చిక్కుకుంది..

Union Minister Rijiju: హిమపాతంలో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. స్వయంగా కారుని నెట్టుకుంటూ వెళ్లిన కిరణ్ రిజిజు
Union Minister Rijiju

Updated on: Dec 27, 2021 | 9:08 PM

Union Minister Rijiju: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి మంత్రి కిరణ్‌ రిజిజు కాన్వాయ్‌ హిమపాతంలో చిక్కుకుంది.  దీంతో కిరణ్ రిజిజు తన కారును కొంత మేర తోసుకుంటూ వెళ్లారు. హిమపాతంలో చిక్కుకున్న వాహనాన్ని నెడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు హిమపాతం కురుస్తున్న ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు తమ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు హిమపాతం గురించి సమాచారాన్ని పొందాలని కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సూచించారు. ఎందుకంటే హిమపాతం మధ్య రహదారి చాలా ప్రమాదకరంగా మారిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ లోని బైసాఖి, సెలా పాస్,  నురానాంగ్‌లలో భారీ హిమపాతం కురుస్తుందని తెలిపారు.

పర్యాటక కేంద్రమైన తవాంగ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. భారీ మంచు కారణంగా రోడ్లపై వాహనాలు నిలిచిపోయే అవకాశం ఉందని తెలిపారు.

 

మరొక ట్వీట్‌లో, న్యాయ మంత్రి కిరెన్ రిజిజు హిమపాతం కురుస్తున్న అందమైన చిత్రాలను పంచుకున్నారు. సెలా పాస్  స్థానిక ప్రజల తాజాగా పరిస్థితిని చూపించారు. ప్రజలు హిమపాతంలో చిక్కుంటే.. వెంటనే భారత ఆర్మీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ , స్థానిక ప్రజలు చాలా సహాయకారిగా ఉంటారని చెప్పారు. అయితే ఎప్పుడూ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండటం మంచిది. తాను భారీ హిమపాతం కురుస్తుండడంతో చాలా నిస్సహాయతను అనుభవించానని చెప్పారు.

 

Also Read: భయాన్ని దూరం చేసే ప్రసిద్ధ కాల భైరవ మందిరాలు.. 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us