Chota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ బతికే ఉన్నాడు.. ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా

చోటా రాజన్ సజీవంగా ఉన్నారని ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా స్పష్టం చేశారు. అతను చనిపోయాడంటే వెలువడిన వార్తలు నిజం కాదని ఆయన కొట్టిపారేశారు.

Chota Rajan: అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ బతికే ఉన్నాడు.. ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా
Underworld Don Chota Rajan Dies

Updated on: May 07, 2021 | 6:02 PM

Chota Rajan dies : కోవిడ్ కారణంగా మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అండర్ వరల్డ్ డాన్ రాజేంద్ర నికల్జే అలియాస్ చోటా రాజన్ కోవిడ్‌తో చనిపోయాడంటూ జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంది. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత కొన్నిరోజులుగా ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (ఎయిమ్స్) లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. అయితే చోటా రాజన్ సజీవంగా ఉన్నారని ఎయిమ్స్ ట్రామా చీఫ్ డాక్టర్ రాజేష్ మల్హోత్రా స్పష్టం చేశారు. అతను చనిపోయాడంటే వెలువడిన వార్తలు నిజం కాదని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయనకు కరోనా చికిత్స అందిస్తున్నామని డాక్టర్ మల్హోత్రా తెలిపారు.


గత సోమవారం చోటా రాజన్ కరోనా లక్షణాలు ఉన్నాయంటూ తీహార్ జైలు అసిస్టెంట్ జైలర్ టెలిఫోన్ ద్వారా అక్కడ సెషన్స్ కోర్టుకు సమాచారం ఇచ్చారు.దీంతో గ్యాంగ్‌స్టర్ ను కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించి ఎయిమ్స్‌లో చేర్పించినట్లు తెలిపారు. 61 ఏళ్ల రాజన్ 2015 లో ఇండోనేషియాలోని బాలి నుండి బహిష్కరించబడిన తరువాత అరెస్టు అయినప్పటి నుండి న్యూ ఢిల్లీలోని హై-సెక్యూరిటీ తీహార్ జైలులో ఉన్నారు. ముంబైలో దోపిడీ, హత్యలకు సంబంధించి 70 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.

ముంబైలో 2011లో ఓ జర్నలిస్టును హత్య చేసినట్లు నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో ఛోటా రాజన్‌కు 2018లో జీవిత ఖైదు విధించారు. అయితే హనీఫ్ లక్డవాలా హత్య కేసులో రాజన్, ఆయన సహచరుడు నిర్దోషులని ఇటీవలే ముంబైలోని సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.

Read Also….తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు.. గంటకు 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us