AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rameswaram Cafe: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. మాస్టర్ బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్, పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా అనే ప్రధాన నిందుతులను అదుపులోకి తీసుకుంది.

Rameswaram Cafe: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్
Rameshwaram
Balu Jajala
|

Updated on: Apr 12, 2024 | 11:28 AM

Share

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. మాస్టర్ బాంబర్ ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్, పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా అనే ప్రధాన నిందుతులను అదుపులోకి తీసుకుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కు అందిన సమాచారం ఆధారంగా.. పశ్చిమ బెంగాల్‌లో చాలా నెలలుగా పరారీలో ఉన్న ఉగ్రవాదులను ఎన్‌ఐఎ బృందం గుర్తించి అరెస్టు చేయగలిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎన్ఐఏ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

అయితే నిందితుడు ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్ ధరించిన క్యాప్ సహాయంతో ఆచూకీ లభించింది. మతీన్ తాహాను అదుపులోకి తీసుకుని విచారించగా.. ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్ చర్య కూడా అదేనని స్పష్టమైంది. తర్వాత ఇంటలిజన్స్ వర్గాలు ఆచూకీ కోసం జల్లెడ పట్టగా దొరికిపోయాడు. అనుమానిత ఉగ్రవాది కర్ణాటకకు చెందినవాడు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలపై అనుమానంతో ఇప్పటికే జైలులో ఉన్న ఉగ్రవాదులను విచారించినప్పటికీ ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ సమయంలో అనుమానిత ఉగ్రవాది షరీక్, జైలులో ఉన్న మతీన్, ఇప్పుడు కస్టడీలో ఉన్న ముస్సావిర్ హుస్సేన్ మధ్య సంబంధం ఉందని కూడా తేలింది.

గత 3-4 సంవత్సరాలుగా తప్పించుకున్నప్పటికీ అనుమానితుడి చిరునామాకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించడంలో NIA అధికారులు విజయం సాధించారు. మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలుడులో ఐదుగురికి పైగా గాయపడ్డారు. అనంతరం బాంబు పెట్టిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. అనంతరం దర్యాప్తు బాధ్యతను ఎన్‌ఐఏకు అప్పగించడంతో ప్రధాన నిందితులను పట్టుబడ్డారు.