ప్రపంచంలోని కుబేరుల వివరాలను హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024ను తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆసియా దేశాల్లో మన భారత్ ప్రధాన భూమిక పోషించింది. ఈ జాబితాలో హైదరాబాద్కు చెందిన టాప్ 10 బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. మన దేశం 275 మంది బిలియనీర్లతో ప్రపంచంలోనే 3వ స్థానాన్ని సాధించింది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. మన దేశంతో పాటు హైదరాబాద్ నగరంలో నివసించే ప్రముఖ సంస్థల అధినేతలు బిలినియర్ల జాబితాలో నిలిచారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలోని బిలినియర్ జాబితాలో వరుసగా 10 ర్యాంకులు సాధించిన వారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, హైదరాబాద్ నగరానికి చెందిన వారికి రావడం గర్వకారణంగా చెప్పవచ్చు. ఆసియాలో హైదరాబాద్ తో పాటు ముంబైకి చెందిన పలు పారిశ్రామిక వేత్తలు కూడా మంచి ర్యాంకులు సాధించారు. వారి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలో అధికశాతం మంది బిలినియర్లు ఉన్న బీజింగ్ను ఈసారి ముంబై వెనక్కు నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 92 మంది బిలియనీర్లు ఉన్న రాజధానిగా ముంబై ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే 91 మంది బిలియనీర్లు కలిగిన బీజింగ్ ముంబై దాటికి వెనుకపడిపోయింది. మొన్నటి వరకు తొలి స్థానంలో ఉన్న బిజింగ్ ను ముంబై అధిగమించి ఆసియా బిలియనీర్ రాజధానిగా అవతరించింది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 3,279 మంది బిలియనీర్లు ఉండగా అందులో 17 మంది హైదరాబాద్ కు చెందిన వారే అవడం విశేషం. ఇంతే కాకుండా ముంబై నుంచి 92 మంది బిలియనీర్లుగా నిలిచారు. అలాగే ప్రపంచ దేశాల్లో అమెరికా 109 మంది బిలియనీర్లకు కొత్తగా అవకాశం ఇవ్వగా ఆ దేశంలో సుసంపన్నుల సంఖ్య 800 మందికి చేరింది. దీంతో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఇక 814 మంది బిలియనీర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది. అంటే అమెరికా కంటే అధికశాతం మంది సంపన్నులు చైనాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 271 మంది బిలియనీర్లతో మన దేశం మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా 84 మంది బిలినియర్ల జాబితాలో చేరడంతో 3వ ర్యాంకు సాధించింది ఇండియా.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..