Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైవాహిక అత్యాచారం కేసులో కీలక మలుపు.. హైకోర్టు తీర్పునకు ప్రభుత్వం మద్దతు..

వైవాహిక అత్యాచారం కేసులో భర్తపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది . భార్యతో బలవంతంగా లైంగిక...

వైవాహిక అత్యాచారం కేసులో కీలక మలుపు.. హైకోర్టు తీర్పునకు ప్రభుత్వం మద్దతు..
Karnataka High Court News
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Dec 23, 2022 | 7:28 AM

వైవాహిక అత్యాచారం కేసులో భర్తపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది . భార్యతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ఐపీసీ సెక్షన్ 376 కింద భర్తపై వచ్చిన అభియోగాలను హైకోర్టు సమర్థించింది. వివాహిత అత్యాచారానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375కి మినహాయింపు 2 -భార్యపై అత్యాచారం నేరం నుండి భర్తకు మినహాయింపునిస్తుంది. ఈ మేరకు జస్టిస్ ఎం నాగ ప్రసన్నతో కూడిన సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. వైవాహిక అత్యాచారంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తాజా కేసులో.. అత్యాచార చట్టం కింద భర్తలకు ఇస్తున్న మినహాయింపును రద్దు చేయాలని కోరుతూ ఎన్జీవోలు ఆర్ఐటీ ఫౌండేషన్, ఆల్ ఇండియా ఆల్ డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు బెంచ్ విచారించింది. పిటిషనర్లు ఐపీసీ సెక్షన్ 375 (రేప్) కు సంబంధించిన రాజ్యాంగ బద్ధతను సవాలు చేశారు.

ఇండియన్ పీనల్ కోడ్ 1860 (ఐపీసీ) 1861లో అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వైవాహిక అత్యాచారాన్ని నేరాల వర్గం నుంచి మినహాయించడానికి మినహాయింపు ఇచ్చింది. భార్యాభర్తల లైంగిక హింసను గుర్తించేందుకు గృహహింస చట్టం ప్రత్యేకంగా రూపొందించారని పిటిషనర్లు వాదించారు. జస్టిస్ రాజీవ్ శక్ధర్, జస్టిస్ సి హరిశంకర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. అయితే ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. ఈ విషయంలో కర్ణాటక హైకోర్టు కొన్ని కఠిన వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ఇప్పుడు కోర్టుకు ప్రభుత్వ మద్దతు కూడా లభించింది.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై దిల్లీ హైకోర్టు స్ప్లిట్ వెర్డిక్ట్ ఇచ్చింది. వ్యాజ్యాలు దాఖలు చేసిన వారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతించారు. లైంగికంగా వేధించే భర్తతో కాపురం చేసే మహిళ హక్కుల్ని హరించేలా ఈ సెక్షన్ ఉందని వాదిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై వాదనలు ఆలకించిన దిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం తీర్పు ఇచ్చింది. భార్య సమ్మతి లేకుండా లైంగిక సంభోగం చేసే భర్తను నేరస్తుడిగా పరిగణించవచ్చని డివిజన్ బెంచ్​కు నేతృత్వం వహించిన జస్టిస్ రాజీవ్​శక్ధేర్ తీర్పు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.