AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ములో ఉగ్రవాదుల కిరాతకం..కిడ్నాప్ చేసి.. దారుణంగా..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా నాగ్‌బరాన్‌లో అబ్‌ ఖదీర్ కోహ్లీ, మంజూర్ అహ్మద్ కోహ్లీ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. సోమవారం నుంచి ఆ ఇద్దరు కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. త్రాల్‌లోని లచీతాప్ బెహక్ అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకొన్న భద్రతా దళాలు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. […]

జమ్ములో ఉగ్రవాదుల కిరాతకం..కిడ్నాప్ చేసి.. దారుణంగా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 28, 2019 | 7:01 AM

Share

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా నాగ్‌బరాన్‌లో అబ్‌ ఖదీర్ కోహ్లీ, మంజూర్ అహ్మద్ కోహ్లీ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. సోమవారం నుంచి ఆ ఇద్దరు కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. త్రాల్‌లోని లచీతాప్ బెహక్ అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకొన్న భద్రతా దళాలు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. ఇక ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. రోడ్డుపై వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. కశ్మీర్‌లోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో మళ్లీ భద్రతను కట్టదిట్టం చేస్తున్నారు.