జమ్ములో ఉగ్రవాదుల కిరాతకం..కిడ్నాప్ చేసి.. దారుణంగా..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా నాగ్బరాన్లో అబ్ ఖదీర్ కోహ్లీ, మంజూర్ అహ్మద్ కోహ్లీ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. సోమవారం నుంచి ఆ ఇద్దరు కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. త్రాల్లోని లచీతాప్ బెహక్ అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకొన్న భద్రతా దళాలు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. […]
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా నాగ్బరాన్లో అబ్ ఖదీర్ కోహ్లీ, మంజూర్ అహ్మద్ కోహ్లీ అనే ఇద్దరు పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశారు. సోమవారం నుంచి ఆ ఇద్దరు కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా.. త్రాల్లోని లచీతాప్ బెహక్ అటవీ ప్రాంతంలో ఆ ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాలను స్వాధీనం చేసుకొన్న భద్రతా దళాలు వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించాయి. ఇక ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. రోడ్డుపై వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో భద్రతా దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. కశ్మీర్లోని అన్ని సున్నితమైన ప్రాంతాల్లో మళ్లీ భద్రతను కట్టదిట్టం చేస్తున్నారు.