
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు తూత్తుకుడి కాల్పుల ఘటనలో విచారణ కమిటీ సమన్లు జారీ చేసింది. టుటికోరిన్ లోని స్టెర్లైట్ ఫ్యాక్టరీలో 2018లోజరిగిన హింసాత్మక ఘటన కేసులో రజనీకాంత్ కు ఈ సమన్లు జారీ చేశారు. దీనిని అధికారికంగా తూత్తుకుడి అని పిలుస్తారు.
తూత్తుకుడిలో ఉన్న వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలంటూ 2018లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తగా, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మృతి చెందారు. అప్పట్లో ఈ ఘటనపై రజనీకాంత్ స్పందిస్తూ నిరసనల్లోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మహిళా జ్యుడిషియల్ ప్యానెల్ రజనీకాంత్ ను దర్యాప్తునకు పిలిచారు. ఆ నిరసనలో సంఘవిద్రోహ శక్తులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపారు. రజనీ వ్యాఖ్యలపై విచారణ జరిపిన కమిటీ విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.