Vande Bharat Express: వందేభారత్ రైలుపై మరో దాడి.. రాళ్లు విసిరిన దుండగులు

వందేభారత్ రైలుపై వరుస దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లపై దాడులు జరుగగా శనివారం రోజున ఉదయం తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. అరక్కొనం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మైసూర్ - చెన్నై వెళ్తున్న వందేభారత్ రైలుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు.

Vande Bharat Express: వందేభారత్ రైలుపై మరో దాడి.. రాళ్లు విసిరిన దుండగులు
Vande Bharat Express

Updated on: May 08, 2023 | 8:04 AM

వందేభారత్ రైలుపై వరుస దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ రైళ్లపై దాడులు జరుగగా శనివారం రోజున ఉదయం తమిళనాడులో మరో ఘటన చోటుచేసుకుంది. అరక్కొనం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మైసూర్ – చెన్నై వెళ్తున్న వందేభారత్ రైలుపై కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు. ఆ రైలులోని సీ6 కోచ్‌లో 75,76 నంబర్ ఉన్న సీట్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ దుర్ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేవు.

అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు రైల్వే రక్షణ దళానికి ఫిర్యాదు చేశారు. 1989 రైల్వే చట్టం ప్రకారం నిందితులపై సెక్షన్ 154 కింద కేసు నమేదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఓ ప్రత్యేక బృందం పని చేస్తున్నట్లు ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు. మార్చి నెలలోని వనియాంబడి పట్టణంలోని మైసురుకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పై కూడా ఓ 21 ఏళ్ల యువకుడు రాళ్లు విసిరినందుకు అతడ్ని అరెస్టు చేశారు. చాలా సందర్భాల్లో వందే భారత్ రైళ్లపై దుండగులు రాళ్లు విసరడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us