AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్ర, శివసేన నేత సంజయ్ రౌత్ ఫైర్

సుశాంత్ సింగ్ కేసులో ఆయనది హత్య కాదని, ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం తమ నివేదికలో స్పష్టం చేసిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ కొంతమంది రాజకీయ నాయకుల మీద, న్యూస్ ఛానెళ్ల మీద విరుచుకపడ్డారు. ఈ కేసులో ముంబై పోలీసులను, ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఈ నేతలు, చానెళ్లు క్షమాపణ చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు.  ఈ కుట్రకు పాల్పడినవారిపై ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలని ఆయన కోరారు. సుశాంత్ కేసుకు సంబంధించి […]

మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే కుట్ర, శివసేన నేత సంజయ్ రౌత్ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 05, 2020 | 4:13 PM

Share

సుశాంత్ సింగ్ కేసులో ఆయనది హత్య కాదని, ఆత్మహత్యేనని ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం తమ నివేదికలో స్పష్టం చేసిన నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ కొంతమంది రాజకీయ నాయకుల మీద, న్యూస్ ఛానెళ్ల మీద విరుచుకపడ్డారు. ఈ కేసులో ముంబై పోలీసులను, ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ఈ నేతలు, చానెళ్లు క్షమాపణ చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు.  ఈ కుట్రకు పాల్పడినవారిపై ప్రభుత్వం పరువు నష్టం దావా వేయాలని ఆయన కోరారు. సుశాంత్ కేసుకు సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తాకు ఏ రాజకీయ పార్టీతోను సంబంధం లేదని సంజయ్ తమ ‘సామ్నా’ పత్రికలో తెలిపారు. కొందరు పొలిటిషియన్లు ., చానెళ్లు కుక్కల్లా మొరిగారని, వారంతా ఇప్పుడేమంటారని ఆయన తీవ్రంగా  ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని, ముంబై పోలీసు శాఖను తప్పు పట్టినవారిని ఏం చేయాలని కూడా ఆయన అన్నారు.