AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teacher Recruitment Scam: ఇంటి నిండా నోట్ల గుట్టలే.. మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ.20 కోట్లు స్వాధీనం..

అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500ల రూ.2 వేల నోట్ల కట్టలే దర్శనమిచ్చినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Teacher Recruitment Scam: ఇంటి నిండా నోట్ల గుట్టలే.. మంత్రి సన్నిహితురాలి ఇంట్లో రూ.20 కోట్లు స్వాధీనం..
Money
Shaik Madar Saheb
|

Updated on: Jul 23, 2022 | 8:31 AM

Share

ED raided Arpita Mukerjee’s house: టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అత్యంత సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం దాడులు చేసింది. ఈ తనిఖీల్లో ఏకంగా రూ.20 కోట్ల నగదు పట్టుబడినట్లు ఈడీ వెల్లడించింది. రాష్ట్రంలోని స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ రిక్రూట్మెంట్ స్కామ్‌ విచారణలో భాగంగా ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. అయితే అర్పితా ముఖర్జీ ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500ల రూ.2 వేల నోట్ల కట్టలే దర్శనమిచ్చినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

ఈ డబ్బుకు ఎస్‌ఎస్‌సి స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. నోట్ కౌంటింగ్ మెషిన్ ద్వారా నగదును లెక్కించేందుకు దర్యాప్తు బృందం బ్యాంకు అధికారుల సహాయం తీసుకుంటోంది. ఈ సందర్భంగా 20కి పైగా మొబైల్ ఫోన్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్‌ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్‌ భట్టాచార్య తదితరుల నివాసాలపై ఈడీ దాడులు చేసిందని అధికారులు తెలిపారు.

అర్పిత.. పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలు.. ఎస్‌ఎస్‌సి స్కామ్‌లో ఈ డబ్బు సంపాదించి ఉంటారని అనుమానిస్తున్నారు. నగదు లెక్కింపు యంత్రం ద్వారా డబ్బును లెక్కించేందుకు సెర్చ్ టీమ్ బ్యాంకు అధికారుల సహాయం తీసుకుంటోంది. ఇది కాకుండా, స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్ల నుంచి కూడా పలు పత్రాలు, అనుమానాస్పద కంపెనీల సమాచారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీ, బంగారం కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గ్రూప్ ‘సి’, ‘డి’ ఉద్యోగులు, 9 నుంచి 12వ తరగతి అసిస్టెంట్ టీచర్లు, ప్రైమరీ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంపై దర్యాప్తు చేయాలని కోల్‌కతా హైకోర్టు ఇటీవల దాఖలైన పలు రిట్ పిటిషన్‌లలో సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో మనీలాండరింగ్‌పై ఈడీ విచారణ జరుపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..