AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఘోర ప్రమాదం.. క్యాబ్ కాలువలో పడి 10 మంది దుర్మరణం

జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం (మార్చి 29) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలో క్యాబ్ కాలువలో పడిపోవడంతో అందులోని ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. క్యాబ్ ప్రయాణికులతో జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై కాలువలో పడిపోయింది.

Road Accident: జమ్మూ-శ్రీనగర్ హైవేపై ఘోర ప్రమాదం.. క్యాబ్ కాలువలో పడి 10 మంది దుర్మరణం
Ramban Riad Accident
Balaraju Goud
|

Updated on: Mar 29, 2024 | 10:28 AM

Share

జమ్మూ కాశ్మీర్‌లో శుక్రవారం (మార్చి 29) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలో క్యాబ్ కాలువలో పడిపోవడంతో అందులోని ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. క్యాబ్ ప్రయాణికులతో జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్తుండగా అదుపుతప్పి ప్రమాదానికి గురై కాలువలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు.

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న క్యాబ్ లోతైన గుంతలో పడిపోయింది. స్థానిక అధికారులకు ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), రాంబన్ నుండి సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాలువలోకి దిగిన బృందం సహాయక చర్యలు ప్రారంభించి మృతదేహాలను బయటకు తీశారు.

మరోవైపు, తెల్లవారుజాము నుంచే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను వెలికి తీశారు. అయితే, ఈ ప్రాంతంలో లోతైన కందకాలు, చీకటి, కుండపోత వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారుతోంది. మధ్యమధ్యలో కొంత సేపు సహాయక చర్యలు ఆగిపోయాయని సమాచారం. రెస్క్యూ ఆపరేషన్‌లో అతిపెద్ద సమస్య వర్షం, దీని వల్ల రెస్క్యూ సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.

శుక్రవారం తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. తవీరా కారుతో క్యాబ్ ప్రయాణికులతో కాశ్మీర్‌కు వెళ్తుండగా, మార్గమధ్యంలో అకస్మాత్తుగా అవాంఛనీయ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై 300 మీటర్ల లోతైన లోయలో క్యాబ్ పడిపోయింది. ఇప్పటి వరకు బయటకు తీసిన మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కుటుంబీకులకు సమాచారం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

రాంబన్‌ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై డీసీ రాంబన్ బషీర్ ఉల్ హక్ తో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సివిల్‌ క్యూఆర్‌టీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…