Ashok Gehlot on Budget: కేంద్ర బడ్జెట్పై రాజస్థాన్ ముఖ్యమంత్రి చురకలు.. ఇంతకీ ఏమన్నారంటే?
బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక రకాల రియాక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్ర బడ్జెట్ను ద్రవ్యోల్బణంగా అభివర్ణించారు.

Rajastan Leaders Reaction on Budget 2022: దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2022 23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్(Budget 2022)ను మంగళవారం సమర్పించారు. కరోనా మహమ్మారి మూడవ వేవ్, ఐదు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీ సర్కార్.. రెండవ టర్మ్ నాల్గవ బడ్జెట్ ఇది కావడం విశేషం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక రకాల రియాక్షన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) కేంద్ర బడ్జెట్ను ద్రవ్యోల్బణంగా అభివర్ణించారు. ఇది పారిశ్రామికవేత్తల జేబులు నింపుతుందన్నారు. సామాన్యులు, రైతులు మరియు కార్మికుల జేబులను ఖాళీ చేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
గత 7 ఏళ్లలో కేంద్రం ఆర్థిక లోటు రెండింతలు పెరిగిందని సీఎం.. ఈ బడ్జెట్ తర్వాత ఈ లోటు మరింత పెరగబోతోందని సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు. రైతులు, సామాన్యులు, పేదలు, మహిళలు, అణగారిన వర్గాలకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు లేవని విమర్శించారు.
బడ్జెట్లో ఉపాధికి సంబంధించిన కొత్త గణాంకాలను సమర్పించామని, అయితే కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక కనిపించడం లేదన్నారు. దాని విధి కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల వాగ్దానం వలెనే ఉంటుందని గెహ్లాట్ అన్నారు. ద్రవ్యోల్బణం పెంచేందుకు, పారిశ్రామికవేత్తల జేబులు నింపేందుకు, సామాన్యులు, రైతు, కూలీల జేబులు ఖాళీ చేసే బడ్జెట్గా ఈ బడ్జెట్ నిరూపిస్తుందని సీఎం అన్నారు.
ఈ బడ్జెట్ నుంచి ఎన్డీయేకు 25 మంది ఎంపీలను ఇచ్చిన రాజస్థాన్ పౌరులు పూర్తిగా నిరాశకు గురయ్యారని అన్నారు. ఈఆర్సీపీకి జాతీయ ప్రాజెక్టు హోదా, జల్ జీవన్ మిషన్లో కేంద్రం, రాష్ట్రం ఖర్చులు 90:10 నిష్పత్తిలో, జైసల్మేర్ కాండ్లా రైల్వే లైన్, మెము కోచ్ల ఏర్పాటుపై బడ్జెట్లో చేసిన ప్రకటనలపై గెహ్లాట్ స్పందించారు. అలాగే, గులాబురాకు సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి ప్రకటన లేదన్నారు.
यह बजट महंगाई बढ़ाने वाला, उद्योगपतियों की जेब भरने वाला एवं आम आदमी, किसान, मजदूर की जेब खाली करने वाला बजट साबित होगा। #Budget2022 pic.twitter.com/nupaXNEeOx
— Ashok Gehlot (@ashokgehlot51) February 1, 2022
యువత, రైతులకు నిరాశః గోవింద్ సింగ్ దోతస్రా అలాగే, రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా మాట్లాడుతూ బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని, ఈ బడ్జెట్ సామాన్యులకు ప్రయోజనం కలిగించదని, ఇది ముఖ్యంగా యువత, రైతులకు నిరాశ కలిగించే బడ్జెట్ అని అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గింపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పారిశ్రామికవేత్తలకు పట్టం కట్టిందని దోతస్రా అన్నారు.
— Balkaur Singh Dhillon (@BalkaurDhillon) February 1, 2022
భారతదేశ అంచనాలకు తగ్గట్టుగా బడ్జెట్: వసుంధర రాజే మరోవైపు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే బడ్జెట్పై స్పందిస్తూ, స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో సమర్పించే బడ్జెట్ ఖచ్చితంగా స్వావలంబన భారతదేశం ఆశలకు అనుగుణంగా ఉంటుందని ట్వీట్ చేశారు. దేశ నిర్మాణానికి కొత్త నిర్వచనాన్ని లిఖించిన ఈ బడ్జెట్లో దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి ఉందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పును తీసుకువస్తుందని రాజే అన్నారు. మొత్తం 135 కోట్ల మంది భారతీయుల సమగ్ర అభివృద్ధికి అంకితమైన ఈ బడ్జెట్, సంపన్న భారతదేశానికి పునాది వేయడం ద్వారా కరోనా వల్ల కలిగే విపత్తులను ఎదుర్కోవడంలో సహాయకరంగా ఉంటుందని వసుంధర రాజే విశ్వసం వ్యక్తం చేశారు.
गांव, किसान, युवा, उद्यमी व मध्यम वर्ग को ध्यान में रखकर पेश किए गए आम बजट के लिए PM श्री @narendramodi जी एवं वित्त मंत्री श्रीमती @nsitharaman जी का अभिनंदन करती हूं। यह बजट सही मायनों में लोकतंत्र के पवित्र मूल्यों की अक्षुण्णता को समर्पित है।#AatmanirbharBharatKaBudget
— Vasundhara Raje (@VasundharaBJP) February 1, 2022
Budget 2022: దేశానికి వెన్నెముక రైతన్న ఈ బడ్జెట్ నుంచి ఏమి కోరుకున్నాడు? నిర్మలమ్మ ఏమిచ్చారు?