Rahul Gandhi – Covid-19: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం మధ్యాహ్నం ట్విట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. తేలికపాటి లక్షణలు కనిపించిన అనంతరం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా.. రిపోర్ట్ పాజిటివ్గా వచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల తనతో సంప్రదించిన వారందరూ కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. జాగ్రత్తగా సురక్షితంగా ఉండండంటూ ఆయన ట్విట్ చేశారు.
After experiencing mild symptoms, I’ve just tested positive for COVID.
All those who’ve been in contact with me recently, please follow all safety protocols and stay safe.
— Rahul Gandhi (@RahulGandhi) April 20, 2021
ఇదిలాఉంటే.. భారత్లో కరోనావైరస్ సవిలయతాండవం చేస్తోంది. గత ఐదు రోజుల నుంచి నిత్యం రెండు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో (సోమవారం).. 2,59,170 కరోనా కేసులు నమోదు కాగా.. 1,761 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 20 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: