
వేసవి వచ్చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొంతమంది వడదెబ్బతో మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు చాలా మంది స్విమ్మింగ్ కు వెళ్తుంటారు. గ్రామాల్లో అయితే కాలువలు, చెరువులకు వెళ్లి జలకాలాడుతుంటారు. అయితే ఈ వేసవికి పాండించ్చేరిలోని ఓ కంపెనీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. క్యాటామారన్ బ్రూయింగ్ కో అనే కంపెనీ బీర్ బస్సును ప్రారంభించింది. అయితే ఈ బస్సులో పర్యాటకులు పాండిచ్చేరి అందాల్ని చూస్తూ ఆనందంగా గడిపేయొచ్చు. ఏప్రిల్ 22 నుంచి ఈ బీర్ బస్సు పాండిచ్చేరి రోడ్లపై చక్కర్లు కొట్టనుంది.
అయితే ఈ బస్సులో టూర్ వేయాలనుకుంటే ఒక్క మనిషికి రూ.3000 టికెట్ ఉంటుంది. చెన్నై నుంచి ఒక రౌండ్ ట్రిప్ ఉంటుంది. ఈ ప్రయాణంలో మూడుసార్లు భోజనం అందిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఎన్ని బీర్లైనా తాగొచ్చు. అయితే ఈ బస్సులో తాగేందుకు అవకాశం ఉండదు. కాని వాళ్లు ఓ ప్రత్యేక ప్రాంతాల్లో ఆపినప్పుడు అక్కడ ఎన్ని బీర్లైనా తాగొచ్చు. ఈ బస్సులో ప్రయాణం 12 గంటల పాటు ఉంటుంది. సుమారు 40 ప్రయాణికులు ఈ బస్సులో వెళ్లొచ్చు. అలాగే ఈ ట్రిప్ వీకెండ్ మాత్రమే ఉంటుంది. అయితే బస్సులో వివిధ ప్రదేశాలు తిరుగుతూ సరికొత్త అనుభూతిని పొందవచ్చని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..