కరోనా వైరస్ పరిస్థితిపై 10 రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్న ప్రధాని మోదీ

| Edited By: Anil kumar poka

Aug 11, 2020 | 10:51 AM

కరోనా వైరస్ పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు.

కరోనా వైరస్ పరిస్థితిపై 10 రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్న ప్రధాని మోదీ
Follow us on

కరోనా వైరస్ పరిస్థితిపై ప్రధాని మోదీ మంగళవారం 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, యూపీ, బీహార్, గుజరాత్, ఏపీ, తెలంగాణ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చిస్తారు. నిన్న అస్సాం, బీహార్, యూపీ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో వరద పరిస్థితి గురించి వర్చ్యువల్ గా ఆయా రాష్ట్రాధినేతలను అడిగి తెలుసుకున్నారు. కాగా ముఖ్యంగా మహారాష్ట్రలో మళ్ళీ కరోనా వైరస్ కేసులు పెరిగాయి. ఆ తరువాత, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లోనూ ఈ మహమ్మారి విజృంభించింది.