
PM Modi – Yashobhoomi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ద్వారకలో అత్యాధునిక సౌకర్యాలతో ‘యశోభూమి’ పేరుతో నిర్మించిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ ను అనుసంధానించే.. ద్వారకా సెక్టార్ 21 నుంచి ద్వారకా సెక్టార్ 25 వరకు పొడగించిన కొత్త మెట్రో స్టేషన్ ప్రాజెక్టును కూడా ప్రధాని మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశరాజధానిలో యశోభూమి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
స్టేషన్ ప్రారంభోత్సవం తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాకపోకలకు అనుమతించనున్నారు. రాబోయే మెట్రో స్టేషన్లో మూడు సబ్వేలు ఉంటాయి: ఒకటి 735 మీటర్ల పొడవుతో స్టేషన్ను ఎగ్జిబిషన్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్, సెంట్రల్ అరేనాతో అనుసంధానిస్తుంది. రెండవ సబ్వే ద్వారకా ఎక్స్ప్రెస్వే మీదుగా ఉన్న ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లకు అనుసంధానించారు. మూడవది మెట్రో స్టేషన్ను యశోభూమి భవిష్యత్తు ఎగ్జిబిషన్ హాల్స్ ఫోయర్కు కలుపుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
న్యూ ఢిల్లీ స్టేషన్ నుంచి ‘యశోభూమి ద్వారకా సెక్టార్ 25’ వరకు మొత్తం ప్రయాణం దాదాపు 21 నిమిషాలు పడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..