PM Modi: జాతీయ ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. పూణెలో తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..

సంత్‌ తుకారాం బోధనలు అందరికి ఆదర్శమన్నారు మోదీ. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌ , మాజీ సీఎం ఫడ్నవీస్‌ తదితరులు హాజరయ్యారు. దేహులో నిర్మించిన శిల ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు మోదీ.

PM Modi: జాతీయ ఐక్యతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.. పూణెలో తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ..
Pm Modi Inaugurates

Updated on: Jun 14, 2022 | 4:28 PM

మహారాష్ట్ర లోని పుణే జిల్లాలో కొత్తగా నిర్మించిన సంత్‌ తుకారాం ఆలయాన్ని మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. సంత్‌ తుకారాం బోధనలు అందరికి ఆదర్శమన్నారు పీఎం మోదీ. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌ , మాజీ సీఎం ఫడ్నవీస్‌ తదితరులు హాజరయ్యారు. దేహులో నిర్మించిన శిల ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు పీఎం మోదీ. ఈ ఆలయం భారత ప్రతిష్టను మరింత పెంచుతుందని అన్నారు. సంత్‌ తుకారాం 13 ఏళ్ల పాటు తపస్సు చేసిన శిల దగ్గర ఆలయాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరాఠీలో కాసేపు ప్రసంగించారు మోదీ. తక్కువ కాలంలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జన్మలో అత్యంత అరుదైన పుణ్యాత్ముల సత్సంగం ఉందని మన గ్రంధాలలో చెప్పబడిందన్నారు. సాధువుల అనుగ్రహం లభిస్తే స్వయంచాలకంగా భగవంతుని సాక్షాత్కారం కలుగుతుందన్నారు. ఇవాళ ఈ పవిత్ర పుణ్యక్షేత్రమైన దేహుకు వస్తున్నప్పుడు తనకూ అలాగే అనిపిస్తుందన్నారు.

దేహు శిలా మందిర్ భక్తి శక్తి కేంద్రంగా మాత్రమే కాకుండా భారతదేశ సాంస్కృతిక భవిష్యత్తును సుగమం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

ఇవి కూడా చదవండి

‘భారతదేశం సాధువుల భూమి’
ప్రపంచంలోని పురాతన నాగరికతలలో మనది ఒకటి అని గర్విస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. దీని ఘనత భారతదేశ సాధువు సంప్రదాయానికి చెందుతుంది. భారతదేశం శాశ్వతమైనది.. ఎందుకంటే భారతదేశం సాధువుల భూమి అని అన్నారు. ప్రతి యుగంలో మన దేశానికి, సమాజానికి దిశానిర్దేశం చేయడానికి ఏదో ఒక గొప్ప ఆత్మ ఇక్కడ అవతరిస్తూనే ఉంటుందన్నారు. నేడు దేశం సంత్ కబీర్దాస్ జయంతిని జరుపుకుంటోందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

వీర్ సావర్కర్ గురించి..

స్వాతంత్ర్య పోరాటంలో వీర్ సావర్కర్‌కు శిక్ష పడినప్పుడు జైలులో చిప్లీలాగా చేతికి సంకెళ్లుతో ఆడుతూ తుకారాం జీ అభంగ్‌ను పాడేవారని గుర్తు చేసుకున్నారు. మన జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి ఈ రోజు మన ప్రాచీన గుర్తింపు, సంప్రదాయాలను సజీవంగా ఉంచడం మన బాధ్యత. అందువల్ల నేడు ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు భారతదేశ అభివృద్ధికి పర్యాయపదాలుగా మారుతున్నప్పుడు.. అభివృద్ధి, వారసత్వం రెండూ కలిసి ముందుకు సాగేలన్నారు ప్రధాని మోడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us