AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఢిల్లీ టు భువనేశ్వర్ వయా విజయవాడ.. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఇదే..

ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నరు ప్రధాని మోది. ముందుగా ఏపీలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లి సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు. ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. 10.40కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

PM Modi: ఢిల్లీ టు భువనేశ్వర్ వయా విజయవాడ.. ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ ఇదే..
Pm Modi
Srikar T
|

Updated on: Jun 12, 2024 | 8:14 AM

Share

ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నరు ప్రధాని మోది. ముందుగా ఏపీలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లి సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు. ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. 10.40కు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీని ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు రిసీవ్ చేసుకోనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 10.55కు సభా ప్రాంగణానికి చేరకుంటారు. కేసరపల్లిలో ఉదయం 11.27కు ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్సవ ముహూర్తంలో పాల్గొననున్నారు. సుమారు గంటన్నరపాటు చంద్రబాబుతో పాటు ప్రముఖులతో కలిసి వేదికపంచుకోనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

ఏపీలోని ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న తరువాత మోదీ తిరిగి ఒడిశాకు పయనమవుతారు. మధ్యాహ్నం 12.45కు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భువనేశ్వర్‎కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 లేదా 3 గంటల సమయంలో భువనేశ్వర్ చేరుకోనున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ తరుణంలో ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నమోహన్‌ చరణ్‌ మాఝీని సభలో పాల్గొననున్నారు. ఈ వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంల పూర్తైన వెంటనే ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు ప్రధాని మోదీ. రాత్రికి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకుంటారు. ప్రముఖుల రాకతో గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్ పోర్టు పరిసరాలన్నీ గస్తీకాస్తున్నారు పోలీసులు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..