AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సీనియర్‌ సిటిజన్లకు మోదీ కానుక..ఇక ఆరోగ్యానికి లేదు ఢోకా.!

భారతదేశపు మొట్టమొదటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద రెండవ దశను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో పంచకర్మ ఆసుపత్రి, ఫార్మాస్యూటికల్ తయారీకి ఆయుర్వేద ఫార్మసీ, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, సెంట్రల్ లైబ్రరీ, IT స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, 500 సీట్ల ఆడిటోరియం ఉన్నాయి.

PM Modi: సీనియర్‌ సిటిజన్లకు మోదీ కానుక..ఇక ఆరోగ్యానికి లేదు ఢోకా.!
Modi
Velpula Bharath Rao
|

Updated on: Oct 29, 2024 | 9:09 AM

Share

అక్టోబర్ 29, అంటే ఈ రోజు ధన్తేరస్ పండుగనే కాకుండా ఆయుర్వేద దినోత్సవం కూడా ఈ రోజే జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశంలోని పెద్దలకు ప్రధాని నరేంద్ర మోదీ ఓ పెద్ద కానుక ఇవ్వనున్నారు.  70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరి కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)ను ప్రారంభించనున్నారు.

ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య సేవలను అందించేందుకు ఆయుష్మాన్ భారత్‌ను కూడా విస్తరించనున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్, వెల్‌నెస్ పట్ల ఉత్సాహం ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.

“రేపు, ఆయుర్వేద దినోత్సవం నాడు మధ్యాహ్నం 12:30 గంటలకు, ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన ముఖ్యమైన పథకాలు ప్రారంభించబడతాయి. ఒక చారిత్రాత్మక తరుణంలో, 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య సంరక్షణ అందించే పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఆయుష్మాన్ భారత్‌ను విస్తరిస్తారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ వెల్‌నెస్ పట్ల మక్కువ ఉన్న వారందరూ రేపటి కార్యక్రమంలో చేరాలని’ మోదీ ట్విట్ చేశారు.

మోదీ ట్వీట్:

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి