
ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోదీ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం బలం, సంయమనం రెండింటినీ ప్రపంచం చూసిందని అన్నారు. సాయుధ దళాల పరాక్రమానికి, ధైర్యానికి నేను సెల్యూట్ చేస్తున్నాను. సైన్యానికి, నిఘా సంస్థలకు నేను సెల్యూట్ చేస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. సైన్యాలు అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించాయని వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రవాదులు ప్రదర్శించిన అనాగరికత దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపివేసిందని అన్నారు. సెలవుల రోజుల్లో పర్యటక ప్రదేశాలకు వెళ్లిన వారిని దారుణంగా చంపారన్నారు. అమాయక పౌరులను మతం గురించి అడిగిన తర్వాత వారి కుటుంబాలు, పిల్లల ముందు వారిని దారుణంగా చంపడం అనేది చాలా దారుణమన్నారు. ఇది కూడా దేశ సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నమన్నారు. నాకు వ్యక్తిగతంగా, ఈ నొప్పి చాలా ఎక్కువ అని, ఈ ఉగ్రవాద దాడి తర్వాత, ఉగ్రవాదంపై కఠిన చర్య కోసం మొత్తం దేశం, ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి తరగతి, ప్రతి రాజకీయ పార్టీ ఒకే గొంతుకగా నిలిచాయని ప్రధాని మోదీ అన్నారు.
ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పేరు కాదని, అది దేశంలోని కోట్లాది మంది ప్రజల మనోభావాలకు ప్రతిబింబమని అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది న్యాయం అవిచ్ఛిన్న ప్రతిజ్ఞ. మే 6వ తేదీ అర్థరాత్రి, మే 7వ తేదీ తెల్లవారుజామున ప్రపంచం మొత్తం ఈ ప్రతిజ్ఞ ఫలితంగా మారడాన్ని చూసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు, వారి శిక్షణా కేంద్రాలపై భారత దళాలు దాడి చేశాయన్నారు.
#WATCH | #OperationSindoor | In his address to the nation, PM Modi says, “On 22 April, in Pahalgam, the barbarism that terrorists have shown have shaken the country and the world. Those innocent people who were celebrating the leaves were killed in front of their families, after… pic.twitter.com/e55EfVi460
— ANI (@ANI) May 12, 2025
భారతదేశం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలదని ఉగ్రవాదులు కలలో కూడా ఊహించి ఉండరని, కానీ దేశం ఐక్యంగా ఉండి, ముందుగా జాతి స్ఫూర్తితో నిండి ఉన్నప్పుడు, బలమైన నిర్ణయాలు తీసుకుంటామని, ఫలితాలు సాధిస్తామని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | During his address to the nation, Prime Minister Narendra Modi says “Operation Sindoor is not just a name. It is a reflection of the feelings of millions of people in the country. Operation Sindoor is an unbroken pledge of justice. Late night of 6 May and morning of 7… pic.twitter.com/0GaTyoDmWM
— ANI (@ANI) May 12, 2025
సింధూరం తుడిచివేయడానికి అయ్యే నష్టాన్ని ఉగ్రవాదులు గ్రహించారా? ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి సైన్యానికి స్వేచ్ఛ ఉంది. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశం మొత్తం కోరుకుంది. ఉగ్రవాదం, వ్యాపారం, చర్చలు పనిచేయవు. ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు పీఓకేపై మాత్రమే ఉంటాయి. ఉగ్రవాదం ఏదో ఒక రోజు పాకిస్తాన్ను నాశనం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్ వైఖరిపై తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయన్నారు.