
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (ఫిబ్రవరి 28) ఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రావు-2025కు హాజరయ్యారు. ఈ సందర్భంగా, జహాన్-ఎ-ఖుస్రో కార్యక్రమంలో భిన్నమైన సువాసన ఉందని, ఈ సువాసన భారతదేశ నేల నుండి వస్తుందని ప్రధాని మోదీ అన్నారు. “హజ్రత్ అమీర్ ఖుస్రో స్వర్గంతో పోల్చిన హిందూస్తాన్. మన హిందూస్తాన్ స్వర్గపు తోట, ఇక్కడ ప్రతి రంగు సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఇక్కడి నేల స్వభావంలో ఏదో ప్రత్యేకత ఉంది. బహుశా అందుకే సూఫీ సంప్రదాయం హిందూస్తాన్కు వచ్చినప్పుడు, అది దాని స్వంత భూమితో అడుగుపెట్టినట్లు అనిపించింది” అని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధానమంత్రి రంజాన్ శుభాకాంక్షలు
“పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది, మీ అందరికీ, దేశవాసులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇటువంటి సందర్భాలు దేశ కళ, సంస్కృతికి ముఖ్యమైనవి. అవి ఓదార్పునిస్తాయి. ఈ జహాన్-ఎ-ఖుస్రో సిరీస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. ఈ 25 సంవత్సరాలలో, ఈ కార్యక్రమం ప్రజల మనస్సులలో చోటు సంపాదించుకోవడం ఒక గొప్ప విజయం” అని ప్రధాని మోదీ అన్నారు.
Highlights from Jahan-e-Khusrau, a programme dedicated to music and culture… pic.twitter.com/K2eSyP4f68
— Narendra Modi (@narendramodi) March 1, 2025
భారతదేశంలో సూఫీ సంప్రదాయం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుందన్నారు ప్రధాని. సూఫీ సాధువులు మసీదులు, ఖంఖాలకే పరిమితం కాలేదు. వారు పవిత్ర ఖురాన్ అక్షరాలను చదివారు. వేదాల పదాలను కూడా విన్నారు. వారు అజాన్ శబ్దానికి భక్తి పాటల మాధుర్యాన్ని జోడించారని కొనియాడారు. ఏ దేశ నాగరికత, సంస్కృతి అయినా దాని పాటలు, సంగీతంలో తమ స్వరాన్ని బట్టి తెలుస్తాయన్నారు. అది కళ ద్వారా వ్యక్తమవుతుంది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు .
ప్రపంచంలోనే అత్యుత్తమ భాష సంస్కృతం
ఈ సందర్భంగా ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాల కంటే భారతదేశం గొప్పదని హజ్రత్ ఖుస్రో అన్నారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సంస్కృతం ప్రపంచంలోనే అత్యుత్తమ భాష అని ఆయన అన్నారు. భారతదేశంలోని ఋషులు గొప్ప పండితుల కంటే కూడా గొప్పవారని ఆయన స్పష్టం చేశారు. హజ్రత్ అమీర్ ఖుస్రోకు ఎంతో ఇష్టమైన వసంతం ఢిల్లీ వాతావరణంలోనే కాదు, ఖుస్రో ప్రపంచ గాలిలో కూడా ఉంది. ఇక్కడి సమావేశానికి వచ్చే ముందు, తెహ్ బజార్ను సందర్శించే అవకాశం లభించింది అని ప్రధాని మోదీ అన్నారు.
Speaking at the Jahan-e-Khusrau programme in Delhi. It is a wonderful effort to popularise Sufi music and traditions. https://t.co/wjwSOcba3m
— Narendra Modi (@narendramodi) February 28, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..