
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం(ఫిబ్రవరి 23) మధ్యాహ్నం మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలో బాగేశ్వర్ ధామ్ను సందర్శించారు. బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి స్వామి ధీరేంద్ర కృష్ణ శాస్త్రితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన క్యాన్సర్ ఆస్పత్రికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హిందువుల ఐక్యతకు ధీరేంద్ర శాస్త్రి చేస్తున్న కృషని ప్రధాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తోపాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొన్నారు.
బాగేశ్వర్ ధామ్ మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలో ఉంది. ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. దీని తరువాత ధీరేంద్ర శాస్త్రి అతన్ని బాలాజీ ఆలయానికి తీసుకెళ్లారు. ఇక్కడ ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేసి, పూలు సమర్పించారు. ఇక్కడి నుండి ప్రధాని మోదీ నేరుగా వేదికపైకి చేరుకున్నారు. ఇక్కడ పండిట్ ధీరేంద్ర శాస్త్రి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. దీని తరువాత, ప్రధాని మోదీ బటన్ను నొక్కడం ద్వారా ‘బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ శంకుస్థాపన చేశారు. రూ. 252 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రితో ఏడు జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది.
ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బుందేల్ఖండి భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మహాకుంభ్పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు మోదీ. మహాకుంభ్ యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కోట్లాదిమంది కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారన్నారు. కొందరు హిందూ ధర్మాన్ని అవమానించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ‘‘ఈ రోజుల్లో మతాన్ని ఎగతాళి చేసే నాయకుల గుంపు ఒకటి ఉంది” అని ప్రధాని అన్నారు. ‘‘వారు హిందువుల విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు. వారు మన నమ్మకాలు, సంస్కృతి, దేవాలయాలపై దాడి చేస్తారు. మన పండుగలు, సంప్రదాయాలను దుర్వినియోగం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు
‘ధీరేంద్ర శాస్త్రి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఐక్యత మంత్రాన్ని కూడా ఇస్తున్నారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించే బాధ్యత తీసుకున్నారు. ఇక నుంచి బాగేశ్వర్ ధామ్లో, భజన, ఆహారం, ఆరోగ్యకరమైన జీవితం, ఆశీర్వాదాలు లభిస్తాయి. దీన్ని సంకల్పించిన ధీరేంద్ర శాస్త్రిని అభినందిస్తున్నానని ప్రధాని అన్నారు. హనుమంతుని ఆశీస్సులతో, ఈ విశ్వాస కేంద్రం ఇప్పుడు ఆరోగ్య కేంద్రంగా మారబోతోంది. ఇక్కడ బాగేశ్వర్ ధామ్ క్యాన్సర్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్న ప్రధాని, ఈ సంస్థ 10 ఎకరాల్లో నిర్మించబడుతుంది; మొదటి దశలోనే ఇది 100 పడకల సౌకర్యాన్ని కలిగి ఉంటుందన్నారు. దీని వల్ల బుందేల్ఖండ్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
आदरणीय प्रधानमंत्री @narendramodi जी के साथ आज बागेश्वर धाम कैंसर हॉस्पिटल के भूमि पूजन में ….#bageshwardham pic.twitter.com/AbrsjFrgpb
— बागेश्वर बाबा (@BageshwarBaba_) February 23, 2025
ఇదిలావుంటే, బాగేశ్వర్ ధామ్ ఈ కొత్త క్యాన్సర్ ఆసుపత్రిని రూ. 252 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 2.37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆసుపత్రి, సమీపంలోని ఏడు జిల్లాల నుండి క్యాన్సర్ రోగులకు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ భవనం సహజ కాంతి, కాలుష్య రహితంగా ఉంటుంది. దాని ఆకారం పిరమిడ్ లాగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ 4,124 చదరపు మీటర్లలో నిర్మిస్తున్నారు. పై అంతస్తు 816 చదరపు మీటర్లలో ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..