AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM MODI: చైనాతో ఉద్రిక్తతల మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన.. వేలాది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలుత మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి..

PM MODI: చైనాతో ఉద్రిక్తతల మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన.. వేలాది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
Pm Modi
Amarnadh Daneti
|

Updated on: Dec 18, 2022 | 1:13 PM

Share

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలుత మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.6,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. మేఘాలయాలో ప్రధాని మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం లభించింది. షిల్లాంగ్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల వలె ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ఈశాన్య ప్రాంతంలో ప్రస్తుతం శాంతి నెలకొని ఉందని తెలిపారు. గతంలో ఆర్మడ్ ఫోర్సెస్‌ (స్పెషల్ పవర్) యాక్ట్ ను రద్దు చేయాలని చాలా డిమాండ్లు వచ్చాయని, . ఇప్పుడు ఎవరూ డిమాండ్ చేయనవసరం లేకుండా ప్రభుత్వమే అడుగు ముందుకేసి ఆర్మడ్ ఫోర్సెస్‌ (స్పెషల్ పవర్) యాక్ట్ రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అమిత్ షా వెల్లడించారు. గతంలో ఈశాన్య ప్రాంతం షట్‌డౌన్‌లు, సమ్మెలు, బాంబు పేలుళ్లు, కాల్పులకు ప్రసిద్ధి చెందిందని, స్థానికంగా పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్నారు. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఈశాన్య ప్రాంతం ఎంతో పురోగతి సాధిస్తోందని, అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!