AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటల్ టనెల్ శిలా ఫలకంపై సోనియా పేరు మిస్సింగ్

హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన అటల్ టనెల్ శిలా ఫలకంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పేరు మిస్సయింది. దీన్ని కావాలనే తొలగించారని పార్టీ వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.

అటల్ టనెల్  శిలా ఫలకంపై సోనియా పేరు మిస్సింగ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 13, 2020 | 10:34 AM

Share

హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన అటల్ టనెల్ శిలా ఫలకంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పేరు మిస్సయింది. దీన్ని కావాలనే తొలగించారని పార్టీ వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుల్ దీప్ సింగ్ రాథోడ్ ప్రకటించారు. టనెల్  ఇనాగురేషన్ కి ముందు సోనియా పేరును తొలగించడం అనైతికమని ఆయన ఆరోపించారు. ఇందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన హిమాచల్ సీఎం జైరాం ఠాకూర్ కి లేఖ రాశారు.