వారణాసిని టార్గెట్‌ చేసిన లష్కరే.. భారీ ఉగ్రదాడికి స్కెచ్

భారత్‌లోని పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారీ స్కెచ్ వేస్తున్నాయి. పవిత్ర దేవాలయాలు, రద్దీగా ఉంటే ప్రదేశాలనే టార్గెట్ చేసుకున్న ఆ ఉగ్రవాదులు.. అక్కడ విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో దాడులు చేసేందుకు లష్కరే ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడ భారీ ఉగ్ర దాడికి స్కెచ్ వేసిన లష్కరే ఈ దిశగా ఏకంగా […]

వారణాసిని టార్గెట్‌ చేసిన లష్కరే.. భారీ ఉగ్రదాడికి స్కెచ్
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 12:32 PM

భారత్‌లోని పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు భారీ స్కెచ్ వేస్తున్నాయి. పవిత్ర దేవాలయాలు, రద్దీగా ఉంటే ప్రదేశాలనే టార్గెట్ చేసుకున్న ఆ ఉగ్రవాదులు.. అక్కడ విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో దాడులు చేసేందుకు లష్కరే ఉగ్ర మూకలు సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అక్కడ భారీ ఉగ్ర దాడికి స్కెచ్ వేసిన లష్కరే ఈ దిశగా ఏకంగా శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు వెల్లడించారు.

అంతేకాదు ఈ ఉగ్రదాడికి అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు గత కొన్ని నెలలుగా లష్కరే ఉగ్రవాదులు వారణాసిని సందర్శించారని అధికారులకు సమాచారం అందింది. లష్కరే ఉగ్రవాది ఉమర్ మాద్ని.. నేపాల్‌కు చెందిన మరో ఉగ్రవాదితో కలిసి మే 7 నుంచి 11 వరకు అక్కడే మకాం వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.